News May 3, 2024
వామ్మో.. రిచర్డ్ వచ్చేస్తున్నాడు!

ఏ అంపైర్ పేరు చెప్తే భారత క్రికెట్ ఫ్యాన్స్ భయపడతారో? అతను మళ్లీ వచ్చేస్తున్నాడు. అతడే రిచర్డ్ కెటిల్బరో. గత తొమ్మిదేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా ఆడిన అన్ని నాకౌట్ మ్యాచుల్లో రిచర్డ్ అంపైర్గా ఉన్నారు. దురదృష్టవశాత్తూ ఆ మ్యాచులన్నింటిలో భారత జట్టు ఓటమి చవి చూసింది. దీంతో అతణ్ని ఐరన్ లెగ్ అంటుంటారు. ఇప్పుడు అతను మళ్లీ టీ20 వరల్డ్ కప్లోనూ అంపైర్గా వ్యవహరించనుండటం అభిమానుల్ని కలవరపెడుతోంది.
Similar News
News November 19, 2025
ఈ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

TG: రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న కనిష్ఠంగా సిర్పూర్లో 6.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. NOV 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 22 నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని పేర్కొంది.
News November 19, 2025
లక్కీ డిప్కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.
News November 19, 2025
BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా(<


