News November 18, 2024
వామ్మో.. రోజూ 40 సిగరెట్ల కాలుష్యాన్ని పీలుస్తున్నారు

ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కలవరపెడుతోంది. అక్కడ ఒక్కో వ్యక్తి రోజూ సగటున 40 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ను పీలుస్తున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆ తర్వాత హరియాణా(29), బిహార్(10), UP(9.5), రాజస్థాన్, బెంగాల్, ఒడిశా(7.5), MP(5.5) ఉన్నాయి. లద్దాక్, లక్షద్వీప్ 0, ఈశాన్య రాష్ట్రాలు, J&K, కర్ణాటక, హిమాచల్, కేరళ 0.5-1, AP, TG ప్రజలు రెండు సిగరెట్ల కాలుష్యాన్ని పీలుస్తున్నారు.
Similar News
News December 15, 2025
విజయ్ హజారే ట్రోఫీ అందరూ ఆడాల్సిందే: BCCI

డిసెంబరు 24 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీలో జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని BCCI స్పష్టం చేసింది. కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోహ్లీ, రోహిత్లకి మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గాయాలతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్కు మినహాయింపు ఉంది.
News December 15, 2025
హిమాలయాల్లో అణు పరికరం.. పొంచి ఉన్న ప్రమాదం!

1965లో చైనా అణు కార్యక్రమంపై నిఘా కోసం అమెరికా CIA భారత్తో కలిసి హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరం ఏర్పాటుచేయాలని భావించింది. మంచు తుఫానుతో ప్లుటోనియం ఉన్న పరికరాన్ని అక్కడే వదిలేశారు. తర్వాత వెళ్లి వెతికినా అది కనిపించలేదు. హిమానీనదాలు కరిగి ఆ పరికరం దెబ్బతింటే నదులు కలుషితం అవ్వొచ్చని సైంటిస్టులు తెలిపారు. తాజాగా బీజేపీ MP నిశికాంత్ ట్వీట్తో ఈ వార్త వైరలవుతోంది.
News December 15, 2025
రేపు ఉదయం దట్టమైన పొగమంచు.. జాగ్రత్త

తెలంగాణలో రేపు దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, సెంట్రల్ తెలంగాణ జిల్లాల ప్రజలు రేపు ఉదయం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హైవేలపై ప్రయాణం చేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, వీలైతే బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే కోల్డ్ వేవ్ కండిషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Share it


