News September 12, 2024
What a Rally: సెన్సెక్స్ 1439, నిఫ్టీ 470 పాయింట్లు అప్

స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ రికార్డులు బద్దలు కొట్టాయి. సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. NSE నిఫ్టీ ఏకంగా 470 పాయింట్లు లాభపడి 25,388 వద్ద ముగిసింది. 15 నిమిషాల్లోనే 193 పాయింట్లు ఎగిసింది. BSE సెన్సెక్స్ 1439 పాయింట్లు ఎగిసి 82,962 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్ల మేర సంపద పోగేశారు. నిఫ్టీలో నెస్లే తప్ప అన్ని షేర్లూ పెరిగాయి. హిందాల్కో, ఎయిర్టెల్, NTPC టాప్ గెయినర్స్.
Similar News
News December 7, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 7, 2025
సర్పంచ్గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It
News December 7, 2025
15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: లోకేశ్

AP: గుజరాత్, ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి జరిగిందని.. రాష్ట్రంలోనూ 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మంత్రి లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ‘కలిసికట్టుగా పనిచేస్తామని పవనన్న పదేపదే చెబుతున్నారు. విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని డలాస్ తెలుగు డయాస్పొరా సమావేశంలో లోకేశ్ తెలిపారు.


