News September 12, 2024
What a Rally: సెన్సెక్స్ 1439, నిఫ్టీ 470 పాయింట్లు అప్

స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ రికార్డులు బద్దలు కొట్టాయి. సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. NSE నిఫ్టీ ఏకంగా 470 పాయింట్లు లాభపడి 25,388 వద్ద ముగిసింది. 15 నిమిషాల్లోనే 193 పాయింట్లు ఎగిసింది. BSE సెన్సెక్స్ 1439 పాయింట్లు ఎగిసి 82,962 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్ల మేర సంపద పోగేశారు. నిఫ్టీలో నెస్లే తప్ప అన్ని షేర్లూ పెరిగాయి. హిందాల్కో, ఎయిర్టెల్, NTPC టాప్ గెయినర్స్.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


