News April 6, 2025
తారక మంత్రం పఠిస్తే ప్రయోజనాలు ఎన్నో?

తారక మంత్రాన్ని మూడు సార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా సహనం పెరుగుతుంది. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. రామ అనే పదం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంగా పరిగణిస్తారు. తారక మంత్రం ఇదే..
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’
Similar News
News January 28, 2026
గ్రూప్ – 2 ఫలితాల్లో సత్తా చాటిన ప్రకాశం పోలీసులు

తాజాగా విడుదలైన గ్రూప్ – 2 ఫలితాలలో ప్రకాశం పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు తమ సత్తా చాటారు. 2018 సివిల్ పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన కే. అశోక్ రెడ్డి, కే .వెంకటేశ్వర్లు, సూర్య తేజలు గ్రూప్ – 2 ఫలితాలలో పలు ఉద్యోగాలను సాధించారు. అశోక్ రెడ్డి డిప్యూటీ తహశీల్దారుగా, ఎక్సైజ్ ఎస్సైలుగా వెంకటేశ్వర్లు, సూర్య తేజలు ఎంపికయ్యారు. వీరికి తోటి సిబ్బందితో పాటు అధికారులు అభినందనలు తెలిపారు.
News January 28, 2026
అజిత్ దాదా.. బారామతి రాజకీయ మాంత్రికుడు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంతరావ్ పవార్ను ఆయన అభిమానులంతా ‘అజిత్ దాదా’గా పిలుచుకునేవారు. పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి నుంచి 1991 నుంచి గెలుస్తూ వస్తున్నారు. గతంలో NCPలో కీలక నాయకుడిగా ఉన్న దాదా ఏకంగా 6 సార్లు Dy.CMగా చేశారు. పొలిటికల్ “సర్వైవర్” గానూ అజిత్ ప్రసిద్ధి. కీలకమైన సమస్యలను సైతం పరిష్కరించడంలో తనదైన ముద్ర వేసేవారు. పవార్ తల్లిదండ్రులు అనంతరావు పవార్, అశాతై పవార్.
News January 28, 2026
147పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

<


