News April 6, 2025

తారక మంత్రం పఠిస్తే ప్రయోజనాలు ఎన్నో?

image

తారక మంత్రాన్ని మూడు సార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా సహనం పెరుగుతుంది. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. రామ అనే పదం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంగా పరిగణిస్తారు. తారక మంత్రం ఇదే..
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’

Similar News

News January 28, 2026

30 రోజుల లోపు మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు కట్టడికి సూచనలు

image

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.

News January 28, 2026

భారీగా పెరిగిన కొబ్బరి ధరలు

image

AP: కొన్ని నెలలుగా ధరలు లేక ఇబ్బందులు పడుతున్న కొబ్బరి రైతులకు ఊరట కలుగుతోంది. TGలో మేడారం జాతర, వరుస శుభకార్యాల ప్రభావంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. వారం కిందటి వరకు వెయ్యి కాయల ధర రూ.15-16వేలు ఉండగా ఇప్పుడు రూ.19-20 వేలకు చేరింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి రోజూ 70 లారీల సరకు ఎగుమతి అవుతోంది. ఇక కురిడీ కొబ్బరిలో పెద్ద రకం రూ.32,500, చిన్నకాయ రూ.29వేల వరకు పలుకుతోంది.

News January 28, 2026

త్వరలో విద్యుత్‌ శాఖలో ఖాళీల భర్తీ: మంత్రి గొట్టిపాటి

image

AP: విద్యుత్‌ శాఖలో ఏఈ స్థాయి ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రకటించారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం మోపిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా, ఎన్నికల లోపు తగ్గించే దిశగా అడుగులు వేస్తోందన్నారు.