News March 22, 2024
కోయంబత్తూరు నుంచి అన్నామలై పోటీకి కారణాలేంటి?
లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు BJP చీఫ్ అన్నామలై గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూరులో ఉత్తరాది నుండి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉండటం, ఇదే ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆశీస్సులు అన్నామలైకు ఉండటం పార్టీకి కలిసొస్తుందని అంటున్నారు. ఇటీవల ఇక్కడ PM పర్యటించడం, 1998 బాంబు బ్లాస్ట్లో చనిపోయిన వారిని గుర్తుచేసుకోవడం కూడా ప్లస్ అవ్వొచ్చని భావిస్తున్నారు.
Similar News
News October 2, 2024
ఈ ఏడాది వర్షాలతో ఎంతమంది చనిపోయారంటే..
ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది కన్నుమూశారని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీరిలో 895మంది వరదల్లో, 597మంది పిడుగుపాటు వలన మరణించినట్లు పేర్కొంది. అత్యధికంగా కేరళలో 397మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది వర్షపాతం గడచిన ఐదేళ్లలో అత్యధికమని IMD వివరించింది.
News October 2, 2024
మాతో ఘర్షణకు దిగొద్దు: ఇరాన్ అధ్యక్షుడు
తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. ఈ దాడిని ఇజ్రాయెల్ దురాక్రమణకు ‘నిర్ణయాత్మక ప్రతిస్పందన’గా అభివర్ణించారు. ఇరాన్ యుద్ధభూమి కాదని, కానీ ఏదైనా ముప్పు ఉంటే దృఢమైన సంకల్పంతో దానికి వ్యతిరేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయం నెతన్యాహు తెలుసుకోవాలని, తమతో ఘర్షణకు దిగవద్దని ట్వీట్ చేశారు.
News October 2, 2024
రిషభ్ పంత్ సరదా మనిషి: లబుషేన్
టీమ్ ఇండియా ఆటగాళ్లందరిలోకీ భారత కీపర్ రిషభ్ పంత్ తనకు ఆసక్తికరంగా అనిపిస్తుంటారని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నారు. ‘పంత్ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటారు. కానీ నిజాయితీగా ఆడతారు’ అని పేర్కొన్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్తో ఏదో విధంగా ఆటను ప్రభావితం చేసే జడేజాను చూస్తే తనకు చిరాకు, అసహనం వస్తుందని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరదాగా వ్యాఖ్యానించారు.