News September 1, 2025
యమ ధర్మరాజు ప్రకారం పాపాలు ఏంటి?

పుణ్యాలు చేసిన వాళ్లు స్వర్గానికి, పాపాలు చేసిన వాళ్లు నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. యమధర్మరాజు ప్రకారం.. తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తులను తిట్టి హింసించేవారు, పరస్త్రీలను కామించేవారు, గోహత్య, శిశుహత్య చేసినవారు మహాపాపులవుతారు. ఇతరుల ఆస్తులను దోచుకొనేవారు, శరణుజొచ్చినవారిని కూడా బాధించేవారు, వివాహాది శుభకార్యాలకు అడ్డుతగిలేవారు కూడా పాపాత్ములే.
Similar News
News September 1, 2025
పంట నష్టంపై నివేదిక ఇవ్వండి: CM రేవంత్

TG: గత ఏడాది పంట నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై సీఎం రేవంత్ అధికారులను ఆరా తీశారు. ఇటీవల వరదలతో ఏర్పడ్డ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. NDRFతో పనిలేకుండా SDRF సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాలని సూచించారు. రోడ్ల డ్యామేజ్పైనా సమగ్ర నివేదిక రూపొందించడంతో పాటు HMDA పరిధిలోని చెరువులను వెంటనే నోటిఫై చేయాలన్నారు.
News September 1, 2025
CBI విచారణపై సస్పెన్స్!

తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న ‘కాళేశ్వరం ప్రాజెక్టు CBI విచారణ’ అంశంపై కేంద్ర నిర్ణయం ఆసక్తికరంగా మారింది. PC ఘోష్ కమిషన్ రిపోర్టులో BJP MP, BRS ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పేరూ ఉంది. దీంతో సొంత నేతపై ఆరోపణలున్న కేసు దర్యాప్తుకు అప్పగిస్తే సెల్ఫ్ గోల్ అవుతుందా? వెయిట్ చేస్తే కాంగ్రెస్ విమర్శలతో ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? తదితర అంశాలు లెక్కలేసుకున్నాకే నిర్ణయం తీసుకోనుంది.
News September 1, 2025
ఈ నెల 6న యూరియా కొరతపై వైసీపీ ఆందోళనలు

AP: రాష్ట్రంలో యూరియా కొరతపై ఈ నెల 6న ఆందోళనలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టనున్నారు. కాగా టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.