News January 4, 2025
బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసింది?: పొన్నం

బీసీల విషయంలో బీఆర్ఎస్ తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆ పార్టీ బీసీలకు ఏం చేసిందో చెప్పాలని ఆయన ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. ‘కాంగ్రెస్లో బీసీలందరం కలిసి మా హక్కుల కోసం గొంతెత్తగలం. ఇదే స్వేచ్ఛ మీ పార్టీలో బీసీలకు ఉందా? అధికారంలో ఉండగా గుర్తురాని బీసీలు మీకు ఇప్పుడు గుర్తొచ్చారా? రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తే బీసీలు చూస్తూ ఊరుకోరు’ అని హెచ్చరించారు.
Similar News
News October 29, 2025
LAYOFFS: లక్షల మంది ఉద్యోగుల తొలగింపు!

ఇటీవల మల్టీ నేషనల్ కంపెనీల్లోనూ భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. లేఆఫ్స్ ఇచ్చిన కంపెనీలివే.. UPSలో 48,000, అమెజాన్లో 30,000, ఇంటెల్లో 24,000, Nestleలో 16,000, యాక్సెంచర్లో 11,000, ఫోర్డ్లో 11,000, నోవో నార్డిస్క్లో 9,000, మైక్రోసాఫ్ట్లో 7,000, PwCలో 5,600, సేల్స్ఫోర్స్లో 4,000 ఉద్యోగాల తొలగింపు వార్తలు వచ్చాయి.
News October 29, 2025
CM చంద్రబాబు ఏరియల్ సర్వే

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి ఆయన హెలికాప్టర్లో బయల్దేరారు. వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై ఉదయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమీక్ష కూడా నిర్వహించారు.
News October 29, 2025
మొంథా తుఫాను – మొక్కజొన్నలో జాగ్రత్తలు

పొలంలో నిల్వ ఉన్న నీటిని 24-48 గంటలలోపు తొలగించాలి. పొలాలు ఎండిన తర్వాత లీటరు నీటికి 10గ్రా. యూరియా+5గ్రా. జింక్ సల్ఫేట్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. కోతకు దగ్గరలో ఉన్న మొక్కజొన్న పొత్తులను వెంటనే కోసి వాటిని 12-13% తేమ స్థాయికి ఆరబెడితే మొలకెత్తదు, నాణ్యత తగ్గదు. కండె కుళ్ళు, ఆకుమచ్చ ఇతర శిలీంద్ర తెగుళ్ల నివారణకు లీటరు నీటికి ప్రాపికొనజోల్ 1ml లేదా మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


