News August 6, 2024
PMగా ఆఖరి నిమిషాల్లో హసీనా ఏం చేశారంటే..

అల్లరి మూకలు చుట్టుముడుతున్న సమయంలో PMగా చివరి నిమిషాల్లో షేక్ హసీనా ఏం చేశారు? ఆమె సన్నిహిత వర్గాల ప్రకారం.. వెంటనే బయలుదేరాలని మధ్యాహ్నం 1.30కి భద్రతా సిబ్బంది హసీనాకు చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించాలన్న ఆమె కోరికను తోసిపుచ్చారు. 1.45 PMకి ప్లానింగ్ కమిషన్ భవనానికి, అక్కడి నుంచి పాత తేజ్గావోన్ ఎయిర్పోర్టుకు సోదరితో సహా హసీనాను తరలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో భారత్కు పంపించారు.
Similar News
News December 15, 2025
రాజమండ్రి: పీజీఆర్ఎస్కు 23 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 15, 2025
కొత్త లేబర్ కోడ్స్.. వారానికి 3 రోజుల వీకాఫ్ నిజమేనా?

కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21న 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కొత్త లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది. వీటి నేపథ్యంలో వారానికి 4 రోజుల పని దినాలపై కార్మిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. 4 రోజులు పని చేసి 3 వీకాఫ్లు కావాలంటే రోజుకు 12Hrs పని చేయాల్సి ఉంటుందని, వారానికి మొత్తం పని గంటలు 48గానే ఉంటాయని తెలిపింది. 12Hrs కంటే ఎక్కువ పని చేస్తే ఓవర్టైమ్ జీతం డబుల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.
News December 15, 2025
Eggoz కాంట్రవర్సీ.. గుడ్లను పరీక్షించనున్న FSSAI

Eggoz బ్రాండ్ గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందనే వార్త ప్రస్తుతం SMలో తెగ వైరలవుతోంది. యూట్యూబ్ ఛానెల్ ‘ట్రస్టిఫైడ్’ వీడియోతో ఈ ‘ఎగ్గోజ్’ వివాదం మొదలైంది. తాజాగా దీనిపై FSSAI స్పందించింది. గుడ్లలో విషపూరితమైన రసాయనం ‘నైట్రోఫ్యూరాన్స్’ ఉందా? లేదా? అనేదానిపై పరీక్షలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్, అన్ బ్రాండెడ్ గుడ్ల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపాలని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది.


