News August 6, 2024

PMగా ఆఖరి నిమిషాల్లో హసీనా ఏం చేశారంటే..

image

అల్లరి మూకలు చుట్టుముడుతున్న సమయంలో PMగా చివరి నిమిషాల్లో షేక్ హసీనా ఏం చేశారు? ఆమె సన్నిహిత వర్గాల ప్రకారం.. వెంటనే బయలుదేరాలని మధ్యాహ్నం 1.30కి భద్రతా సిబ్బంది హసీనాకు చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించాలన్న ఆమె కోరికను తోసిపుచ్చారు. 1.45 PMకి ప్లానింగ్ కమిషన్ భవనానికి, అక్కడి నుంచి పాత తేజ్‌గావోన్ ఎయిర్‌పోర్టుకు సోదరితో సహా హసీనాను తరలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో భారత్‌కు పంపించారు.

Similar News

News December 13, 2025

మారికవలస: పురుగులు మందు తాగి యువకుడి మృతి

image

మారికవలసలోని ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలలో అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న ఉమా మహేశ్ (27) పురుగు మందు తాగి
శనివారం చనిపోయాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సమాచారంతో యువకుడి తండ్రి నారాయణరావు పాఠశాలకు చేరుకున్నారు. ఆయన ఫిర్యాదుతో పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 13, 2025

‘న్యూ ఇయర్’ వేడుకలకు పోలీసుల ‘కొత్త కోడ్’

image

TG: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో 3 స్టార్ హోటల్స్, పబ్స్, క్లబ్‌లకు HYD పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. ‘డ్రగ్స్ దొరికితే యాజమాన్యానిదే బాధ్యత. పార్కింగ్‌ సహా అంతటా CCTVలు ఉండాలి. బయట రా.10 గం.కు సౌండ్‌ సిస్టమ్‌ ఆపాలి. లోపల 45 డెసిబుల్స్‌తో ఒంటిగంట వరకే అనుమతి. డ్రంకెన్ డ్రైవ్‌కు రూ.10 వేలు ఫైన్, 6నెలల జైలు/లైసెన్స్ రద్దు. తాగిన వారికి డ్రైవర్లు/క్యాబ్‌లు నిర్వాహకులే ఏర్పాటు చేయాలి’ అని తెలిపారు.

News December 13, 2025

ప్రధానమంత్రి ఆవాస్ యోజన‌ నిధులు.. తెలంగాణకు సున్నా

image

PMAY-G కింద FY25-26 నిధులలో TGకి నయాపైసా కూడా కేటాయించలేదు. ఈ పథకం కింద 4 ఏళ్లలో మొత్తం ₹1,12,647.16CR విడుదల చేస్తే TGకి, WBకి పైసా రాలేదు. APకి ₹427.6CR వచ్చాయి. BJP పాలిత రాష్ట్రాలు, బిహార్ వంటి కొన్ని NDA అధికారంలో ఉన్న స్టేట్స్‌కే అత్యధిక వాటా దక్కింది. అలాగే ఎన్నికలు జరగనున్న TN, కేరళ వంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులయ్యాయి. MH కాంగ్రెస్ MP వేసిన ప్రశ్నకు కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.