News March 30, 2024
రాయలసీమకు ఏం చేశావ్ జగన్?: CBN

AP: సీఎం జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశావని జగన్కు సవాల్ విసురుతున్నా. జగన్కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు. టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. మేం ‘కియా’ పరిశ్రమ తెస్తే.. జగన్ ‘జాకీ’, ‘అమర్ రాజా’ కంపెనీలను వెళ్లగొట్టారు’ అని విమర్శించారు.
Similar News
News November 20, 2025
దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ వద్ద అసభ్యకరంగా హిజ్రాలు.. అరెస్ట్

HYD చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద రాత్రిళ్లు రోడ్లపై నిల్చొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యువకులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఇద్దరు హిజ్రాలను సీఐ సైదులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
News November 20, 2025
ఎదురుపడ్డా పలకరించుకోని జగన్-సునీత!

అక్రమ ఆస్తుల కేసులో AP మాజీ సీఎం జగన్ ఇవాళ HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన బాబాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కోర్టులోనే ఉన్నారు. తన తండ్రి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని దాఖలు చేసిన పిటిషన్ వాదనల నేపథ్యంలో ఆమె న్యాయస్థానానికి హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో అన్నాచెల్లెళ్లు ఎదురు పడినా ఒకరినొకరు పలకరించుకోలేదని, ఎవరో తెలియనట్లు వ్యవహరించినట్లు సమాచారం.
News November 20, 2025
ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రానికి స్థలం: CM

TG: ఈశాన్య రాష్ట్రాలతో సత్సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. HYDలో జరిగిన తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్రకటించారు. TG సోదరుడు త్రిపుర గవర్నర్(ఇంద్రసేనా రెడ్డి)గా, త్రిపుర సోదరుడు TG గవర్నర్గా పనిచేస్తున్నారని CM అన్నారు.


