News January 29, 2025
ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రాంప్రసాద్ ఏమన్నారంటే?

ఏపీలో త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ముగ్గురు మంత్రులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెల 6న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది.
Similar News
News January 10, 2026
టికెట్ ధరల పెంపు మీకు ఓకేనా?

సినిమా టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు ఒక అంతుచిక్కని ప్రశ్న. ఒకవైపు ‘భారీ బడ్జెట్ సినిమాలకు పెంపు తప్పదు’ అని మేకర్స్ అంటుంటే, ‘సామాన్యుడు వినోదానికి దూరం కావాలా?’ అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సినిమా బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతాం అనుకునే వారు కొందరైతే, కుటుంబంతో కలిసి చూడాలంటే ఈ ధరలు భారమేనని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నారు. ఓ సామాన్యుడిగా టికెట్ ధరల పెంపుపై మీ అభిప్రాయం ఏంటి? COMMENT
News January 10, 2026
అమరావతిపై జగన్ అడిగింది అదే: సజ్జల

AP: CM CBN చెబుతున్న అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని YCP స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల ఆరోపించారు. ‘పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచుతున్నారు. అంత డబ్బు అవసరమా? అని మాత్రమే జగన్ అడిగారు. అమరావతిపై ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రాజధాని పేరుతో జగన్ను దూషిస్తున్నారు. అమరావతి టెండర్లలో కొన్ని కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి సమాధానం చెప్పట్లేదు’ అని విమర్శించారు.
News January 10, 2026
సుధామూర్తి చెప్పిన పేరెంటింగ్ సూత్రాలు

ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది సవాలుగా మారుతోంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు చాలా విషయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం, పుస్తకాలు చదివించడం, సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పడం, పెట్టాల్సిన చోట హద్దులు పెడుతూనే ఇవ్వాల్సిన చోట స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు పిల్లలకు పేరెంట్స్ రోల్మోడల్లా ఉండాలంటున్నారు.


