News August 3, 2024
BRSను తిట్టడం తప్ప రేవంత్ ఏం చేశారు?: BJP MLA

TG: BRSను తిట్టడం తప్ప CM రేవంత్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పడం లేదని BJP MLA వెంకట రమణారెడ్డి విమర్శించారు. రేవంత్ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆయన హితవు పలికారు. బ్లాక్ టికెట్లు అమ్మేవారు కూడా బాగా మాట్లాడుతారని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడటం బాధాకరమన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు.
Similar News
News March 23, 2026
యుద్ధంతో అమెరికాకు ₹7,520 కోట్ల నష్టం

పశ్చిమాసియాలోని అమెరికన్ మిలిటరీ బేస్లపై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల వల్ల USకు ₹7,520 కోట్ల నష్టం వాటిల్లిందని BBC, CSIS నివేదిక వెల్లడించింది. యుద్ధం మొదలైన తొలి 2 వారాల్లోనే ఈ నష్టం జరిగినట్లు అంచనా. జోర్డాన్లోని థాడ్ రాడార్ వ్యవస్థ ధ్వంసం అవ్వడం వల్ల సుమారు ₹4,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు US డిఫెన్స్ సిస్టమ్స్ను ఛేదించి ఈ విధ్వంసం సృష్టించాయి.
News March 23, 2026
ఖరీఫ్కు కష్టమే.. తగ్గిన యూరియా తయారీ!

హార్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్కు రావాల్సిన LNG సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి 50% పైగా పడిపోయింది. గ్యాస్ కొరత వల్ల గెయిల్, IOC వంటి సంస్థలు యూరియా ప్లాంట్లకు సప్లై తగ్గించాయి. ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్కు అవసరమైన 170-180 లక్షల టన్నుల యూరియా లభ్యతపై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం దేశంలో కేవలం 62 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గాయి.
News March 23, 2026
రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి.. నేడు ఆర్సెలార్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్కు CM CBN ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి Dy.CM పవన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 1.25L మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి 2033కు పనులు పూర్తిచేయాలనేది లక్ష్యం.


