News December 20, 2024

‘భూ భారతి’ బిల్లు ఆమోదంపై రూపకర్త ఏమన్నారంటే?

image

TG: ‘భూ భారతి’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంపై భూ చట్టాల నిపుణుడు, బిల్లు రూపకర్త భూమి సునీల్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టం రూపొందించేందుకు ఆయన ఎంతలా శ్రమించారో Xలో రాసుకొచ్చారు. ‘ఓ సంవత్సర కష్టం. వందల గంటల మీటింగ్‌లు. వేల మంది అభిప్రాయాలు. 24 డ్రాఫ్ట్‌లు. భూభారతి (ఆర్.ఓ.ఆర్) చట్టం. ఈరోజు అసెంబ్లీ ఆమోదించింది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

తిరుపతి: యువకుడి జోబిలో పేలిన ఫోన్

image

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ కొత్త కండ్రిగకు చెందిన నరసింహారెడ్డి(36) పిడుగుపాటుకు గురైన విషయం విధితమే. నరసింహారెడ్డి తన పొలంలో కూలీల చేత వరినాట్లు నాటించాడు. వర్షం వస్తుండడంతో గొడుగు వేసుకుని నిలబడి ఉండగా సమీపంలోనే పిడుగు పడింది. దీంతో అతని ఫ్యాంట్‌లోని ఫోన్ పేలింది. తొడ భాగం పూర్తిగా కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు హాస్పిటల్‌కు తరలించారు. వర్షంలో తస్మాత్ జాగ్రత్త.

News November 22, 2025

ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

image

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.

News November 22, 2025

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు!

image

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాలాలను బట్టి ఎండ, వానలు, చలి అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ ప్రభావంతో దేశంలో 4 వేల మందికి పైగా చనిపోయారని, 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొంది.