News November 20, 2024
ఎగ్జిట్ పోల్స్పై ఎన్నికల సంఘం ఏం చెప్పింది?

ఎగ్జిట్ పోల్స్ విషయంలో సర్వే సంస్థలకు స్వీయ నియంత్రణ అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో వ్యాఖ్యానించింది. ‘ఎన్ని శాంపిల్స్ సేకరించారు? ఎక్కడ సర్వే చేశారు? ఒక వేళ ఫలితాలు అంచనాలకు విరుద్ధంగా వస్తే సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుంటాయి?’ అని ప్రశ్నించింది. సర్వేలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అంచనాలు, ఫలితాలు విరుద్ధంగా ఉండడం సమస్యకు దారి తీస్తుందని పేర్కొంది.
Similar News
News January 2, 2026
APPLY NOW: బాల్మర్ లారీలో ఉద్యోగాలు

బాల్మర్ లారీలో 18 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 4) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MTM, MBA, BE/B.Tech,డిగ్రీ, MCA ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.balmerlawrie.com
News January 2, 2026
ఏపీలో పెరిగిన GST వసూళ్లు

AP: డిసెంబర్లో రాష్ట్ర GST వసూళ్లు పెరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 5.78% ఎక్కువగా రూ.2,652 కోట్లు వసూలైంది. జాతీయ సగటును (5.61%) సైతం మించింది. దీంతో దక్షిణాదిలో తమిళనాడు తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్థూల వసూళ్లు రూ.3,137 కోట్లకు చేరాయి. SGST, IGST, పెట్రోలియం వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.39,517 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది.
News January 2, 2026
అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇన్స్టాకు పోలీసుల లేఖ

యూట్యూబర్ <<18719766>>అన్వేష్కు<<>> హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. విదేశాల్లోని అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలని పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్కు లెటర్ రాశారు. అన్వేష్కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాగా హిందూ దేవతలను కించపరిచారని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిపై హిందూసంఘాలు మండిపడుతున్నాయి.


