News November 18, 2024

స్కూళ్ల టైమింగ్స్ పెంపుపై మీరేమంటారు?

image

AP: స్కూళ్ల టైమింగ్స్ పెంపుపై విద్యాశాఖ పునరాలోచించాలని ఏపీటీఎఫ్ కోరింది. 5కి.మీ పరిధి నుంచి వస్తున్నందున సాయంత్రం 5 గంటల వరకు బడిలోనే ఉంటే ఇళ్లకు వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. చీకటి పడటంతో పాటు ఇతర సమస్యల కారణంగా సమయం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది. అయితే సిలబస్ పూర్తి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి స్కూళ్ల టైమింగ్స్ పొడిగింపుపై మీరేమంటారు?

Similar News

News November 23, 2025

నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్ రెడ్డి

image

పుట్టపర్తిలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హెలికాప్టర్లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే బాబా శతజయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. 11 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధి దర్శించుకుంటారు. 11.45 గంటలకు సత్యసాయి విమానాశ్రయం నుంచి తిరుగుపయనం అవుతారు.

News November 23, 2025

కేజీ రూపాయి.. డజను రూ.60!

image

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.

News November 23, 2025

కుజ దోష నివారణకు చేయాల్సిన పూజలు

image

కుజ దోషానికి అంగారకుడు కారణం. ఆయనను పూజిస్తే ఈ దోషం పోతుందని నమ్మకం. ఉజ్జయినీలో శివుడి చెమట నుంచి పుట్టిన అంగారకుడి మంగళనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ కుజ దోష నివారణకు పూజలు చేస్తారు. APలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయాల్లో నిర్వహించే శాంతి పూజలు కుజ దోష నివారణకు ప్రసిద్ధి. మంగళవారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఈ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.