News April 3, 2025
ట్రంప్ టారిఫ్లు, చైనా ఆక్రమణలపై ఏం చెప్తారు?: రాహుల్

భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల అంశాన్ని LOP రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించారు. ‘ఈ టారిఫ్లపై కేంద్రం స్పందించాలి. ఈ సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అటు భారత్కు చెందిన 4వేల చ.కి.మీపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అక్కడి రాయబారి ద్వారా ఈ విషయం తెలిసిందని సంచలన ఆరోపణలు చేశారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


