News September 21, 2024
లెబనాన్లో పేజర్ల పేలుళ్లకు కేరళకు సంబంధం ఏంటి?
లెబనాన్లో పేజర్ల పేలుళ్ల ఘటనలో కేరళలో పుట్టిన, నార్వే సిటిజన్ రిన్సన్ జోస్(36) పేరు వినిపించింది. బల్గేరియాకు చెందిన నార్టా గ్లోబల్ కంపెనీకి జోస్ యజమాని. పేజర్లను తైవానీస్ సంస్థ గోల్డ్ అపోలో ట్రేడ్మార్క్తో BAC కన్సల్టింగ్ అనే హంగేరియన్ కంపెనీ తయారు చేసింది. అయితే వాటిని జోస్ సంస్థ ద్వారా కొనుగోలు చేశారనే వార్తలొచ్చాయి. బల్గేరియా జాతీయ భద్రత ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది.
Similar News
News September 21, 2024
పెళ్లి చేసుకోమని ఆమె వేధించింది: జానీ మాస్టర్ భార్య
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్ భార్య ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె చిన్న పిల్ల కాదు. పెళ్లి చేసుకోండని ఆమె జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచి, బయట పెళ్లి చేసుకోమనేది. మతం మార్చుకుంటానని కూడా చెప్పేది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసేది. ఆమె వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News September 21, 2024
జనవరిలో బీచ్ ఫెస్టివల్: దుర్గేశ్
AP: YCP ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. కాకినాడలో NTR బీచ్ను ఆయన పరిశీలించారు. ‘YCP ప్రభుత్వం నిలిపివేసిన బీచ్ ఫెస్టివల్ను పునరుద్ధరిస్తాం. జనవరిలో నిర్వహిస్తాం. అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్కును పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి చేస్తాం’ అని దుర్గేశ్ వెల్లడించారు.
News September 21, 2024
బోయపాటి-బాలకృష్ణ మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ ద్వయం నుంచి వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ కాంబోలో మరో చిత్రం రానుండగా దసరాకు షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా తమన్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తోంది. సూపర్ హిట్ అఖండ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కనుందని టాక్. దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.