News March 29, 2024
డీప్ఫేక్పై ప్రధాని ఏమన్నారంటే?

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో ‘చాయ్ పే చర్చ’లో డీప్ఫేక్పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి దేశంలో డీప్ఫేక్ను ఎవరైనా ఉపయోగించవచ్చని.. కొందరు తన గొంతును అనుకరించారని చెప్పారు. ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో వెళ్తుందన్నారు. AIతో తన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించినట్లు గుర్తు చేశారు. ఏఐ శక్తిమంతమే అయినా.. దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు.
Similar News
News March 28, 2026
IPL ప్రసారాలపై బంగ్లాదేశ్లో నిషేధం ఎత్తివేత

బంగ్లాదేశ్లో IPL ప్రసారంపై బ్యాన్ను ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపాన్ ప్రకటించారు. ముస్తాఫిజుర్ను తొలగించారన్న కారణంతో యూనస్ ప్రభుత్వం IPLను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ లేదా వేరే ఏ ఛానల్ ప్రసారం చేసినా అనుమతిస్తామని జహీర్ తెలిపారు. బ్రాడ్కాస్టింగ్కు సంబంధించి తమకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు.
News March 28, 2026
ఆంధ్రా అమ్మాయిలు అదరగొట్టారు

న్యూఢిల్లీ వేదికగా జరిగిన బధిర అమ్మాయిల T10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఆంధ్రా జట్టు సొంతం చేసుకుంది. ఢిల్లీతో జరిగిన ఫైనల్లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆంధ్రా 73/4 స్కోర్ చేయగా, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 68/4 స్కోర్ మాత్రమే చేసి ఓడిపోయింది. టోర్నీలో రాణించిన కాంతమ్మకు ఉమెన్ ఆఫ్ ది సిరీస్, ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.
News March 28, 2026
ఏడాది పొడవునా కాపునిచ్చే మామిడి!

సాధారణంగా మామిడి వేసవిలోనే దొరుకుతుంది. కానీ రాజస్థాన్కు చెందిన రైతు కిషన్ సుమన్ పదేళ్లు శ్రమించి ‘సదాబహార్’ అనే మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏడాదికి మూడుసార్లు కాపునిస్తూ తియ్యగా, తక్కువ పీచుతో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ తోటలోనూ ఇది చోటు సంపాదించుకుంది. మామిడి ప్రియులకు ఏడాది పొడవునా పండ్లను అందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈయన 7 రంగుల గులాబీ మొక్కనూ అభివృద్ధి చేశారు.


