News July 18, 2024
వరంగల్ డిక్లరేషన్లో ఇంకా ఏం ఉంది?

TG: వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన రైతు రుణమాఫీని CM రేవంత్ అమల్లోకి తెచ్చారు. దీంతో పాటు రైతు భరోసా కింద ఎకరాకు ₹15వేలు, కూలీలకు ₹12వేలు, చక్కెర కర్మాగారం రీఓపెన్, పసుపుబోర్డు ఏర్పాటు, పంట నష్టపరిహారం, రైతులు/రైతు కూలీలకు బీమా, వ్యవసాయానికి ఉపాధి పథకం, రైతులకు పోడు, అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులు, ధరణి రద్దు, అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి, రైతు కమిషన్ ఏర్పాటు, నూతన వ్యవసాయ విధానం ఉన్నాయి.
Similar News
News December 14, 2025
యూరినరీ ఇన్కాంటినెన్స్కు ఇలా చెక్

40-50 ఏళ్లు పైబడిన మహిళల్లో యూరినరీ ఇన్కాంటినెన్స్(మూత్రంపై పట్టుకోల్పోవడం) సమస్య వస్తుంటుంది. దీనివల్ల తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు యూరిన్ లీకేజీ అవుతుంది. క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే 12 వారాలపాటు వ్యాయామాలు, యోగా చేస్తే ఈ సమస్యను అదుపు చేయొచ్చని ‘స్టాన్ఫర్డ్ మెడిసిన్’ అధ్యయనంలో తేలింది. మందులతో సమానంగా దీని ఫలితాలు ఉంటాయని వెల్లడైంది. #WomenHealth
News December 14, 2025
వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల హవా కొనసాగుతోంది. ఈ వారంలో(DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరగడంతో రూ.1,22,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.
News December 14, 2025
పసుపులో దుంపకుళ్లు తెగులు – నివారణ

నీరు నిలిచే, తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు పంటకు దుంపకుళ్లు ముప్పు ఎక్కువ. దీని వల్ల కాండంపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దుంప చూస్తే వేర్లు కుళ్లి నల్లగా మారి, లోపల చిన్న పురుగులు ఉండి, దుర్వాసన వస్తుంది. దీని నివారణకు ఎకరాకు 100kgల వేపపిండి వేయాలి. తల్లి పురుగుల కట్టడికి 3g కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 10kgలు వేయాలి. కుళ్లినచోట లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపిన ద్రావణం పోయాలి.


