News October 15, 2024

2019లో మహారాష్ట్రలో ఏం జరిగింది? (1/2)

image

2019 Octలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో BJP- అప్ప‌టి ఉద్ధ‌వ్ నేతృత్వంలోని శివ‌సేన కూట‌మి 161 స్థానాలు గెలుచుకుంది. BJP105, శివ‌సేన 56 సీట్లు ద‌క్కించుకున్నాయి. అయితే, ఫ‌లితాల త‌రువాత త‌మ‌కూ CM ప‌ద‌వి ఇవ్వాల‌ని శివ‌సేన మెలిక పెట్టింది. దీనికి BJP అంగీక‌రించ‌లేదు. దీంతో కాంగ్రెస్ (44), ఎన్సీపీ (54)ల మ‌ద్ద‌తుతో ఉద్ధ‌వ్ ఠాక్రే CM అయ్యారు. త‌ద్వారా మ‌హారాష్ట్రలో మ‌హావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్ప‌డింది.

Similar News

News November 23, 2025

ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు కానీ ఆధారాలు లేవు: ప్రశాంత్ కిషోర్

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంపై జన్‌ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే అనుమానం ఉందని, కానీ దానికి ఆధారాలు లేవని తెలిపారు. గ్రౌండ్‌ ఫీడ్‌బ్యాక్‌కు భిన్నంగా ఫలితాలు ఉన్నాయని, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని అన్నారు. కాగా 243 స్థానాలున్న బిహార్‌లో 238 చోట్ల పోటీ చేసినా JSP ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం 2-3%కే పరిమితమైంది.

News November 23, 2025

చెమటోడ్చుతున్న భారత బౌలర్లు

image

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. రెండో రోజూ ఆట తొలి సెషన్‌లో వికెట్లేమీ తీయలేదు. అర్ధసెంచరీ చేసిన ముత్తుస్వామి(56*), కైల్(38*) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు తొలి ఇన్నింగ్సులో 316/6.

News November 23, 2025

రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: ఐబొమ్మ రవి తండ్రి

image

<<18323509>>ఎన్‌కౌంటర్<<>> చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పు బట్టారు. ‘ఆయనను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా’ అని చెప్పారు.