News October 15, 2024
2019లో మహారాష్ట్రలో ఏం జరిగింది? (1/2)

2019 Octలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BJP- అప్పటి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన కూటమి 161 స్థానాలు గెలుచుకుంది. BJP105, శివసేన 56 సీట్లు దక్కించుకున్నాయి. అయితే, ఫలితాల తరువాత తమకూ CM పదవి ఇవ్వాలని శివసేన మెలిక పెట్టింది. దీనికి BJP అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ (44), ఎన్సీపీ (54)ల మద్దతుతో ఉద్ధవ్ ఠాక్రే CM అయ్యారు. తద్వారా మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది.
Similar News
News November 12, 2025
బంద్ ఎఫెక్ట్.. విద్యార్థులకు షాక్!

TG: ప్రైవేట్ కాలేజీల <<18182444>>బంద్<<>>తో పరీక్షలకు దూరమైన ఫార్మసీ విద్యార్థులకు విద్యాశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. సమ్మె సమయంలో నిర్వహించిన పరీక్షలు మళ్లీ నిర్వహించలేమని, సప్లిమెంటరీ రాసుకోవాలని స్పష్టం చేసింది. కాగా దీనిపై సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేస్తామని FATHI తెలిపింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఈ నెల 3 నుంచి 4 రోజుల పాటు ప్రైవేట్ కాలేజీలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
News November 12, 2025
నోట్లు తీసుకొని.. ఓట్లు మరిచారు!

TG: జూబ్లీహిల్స్ బైఎలక్షన్లో 50శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. ప్రధాన పార్టీలు రూ.వందల కోట్లు పంచినట్లు తెలుస్తున్నా.. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటర్లు ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల బస్తీవాసులు హక్కు వినియోగించుకోగా అపార్ట్మెంట్లలో ఉన్నవారు ఆసక్తి చూపలేదు. ఇక ఇక్కడ ఉంటూ వేరే ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు లేకపోవడమూ పోలింగ్పై ప్రభావం చూపింది.
News November 12, 2025
హైపర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

ఈ పేరెంటింగ్ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల ప్రతి తప్పు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి అంశంలోనూ ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తే అంగీకరించరు. దీంతో పిల్లలు కూడా వారిని అర్థం చేసుకోలేరు. ఇలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.


