News March 16, 2025
పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (2/2)

తమ ఆత్మగౌరవం కోసం ఆ మహానుభావుడు చిత్రవధ అనుభవించి చనిపోతే తెలుగువారెవరూ స్పందించలేదు. అంత్యక్రియలకే దిక్కులేదు. గాయకుడు ఘంటసాల ఎద్దులబండిపై శవయాత్ర ప్రారంభించారు. ఈలోగా చేరుకున్న ప్రకాశం పంతులు బండెక్కి తెలుగువారి చేతకానితనంపై బూతులు లంకించుకున్నారు. క్షణాల్లో నగరమంతా వార్త పాకింది. లక్షల్లో జనం జతయ్యారు. మద్రాసు తగలబడింది. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రకటన వెలువడింది.
Similar News
News January 30, 2026
రోజుకు లక్షన్నర బ్యారెల్స్.. రష్యా నుంచి ఇండియాకు!

రష్యా నుంచి పెద్దమొత్తంలో క్రూడాయిల్ను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఫిబ్రవరి నుంచి రోజూ సుమారు 1.5 లక్షల బ్యారెల్స్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటామని కంపెనీ చెప్పిందని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆంక్షల లిస్టులో లేని రష్యన్ కంపెనీల నుంచి రానున్న 2 నెలలు కొననుందని వెల్లడించింది. US ఆంక్షల నుంచి మినహాయింపు తీసుకుని డిసెంబర్లోనూ రష్యా క్రూడ్ను కొనిందని చెప్పింది.
News January 30, 2026
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో పోస్టులు

<
News January 30, 2026
ఫిబ్రవరి 3న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: వచ్చే నెల 3న క్యాబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో పాటు కీలక ఇష్యూలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 28న మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తుండడం విశేషం.


