News May 4, 2024

మహిళలకు రూ.2500 ఏమైంది?: హరీశ్‌రావు

image

TG: మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని BRS MLA హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన హామీలు సైతం నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్.. యువత, నిరుద్యోగులను సైతం మోసం చేసిందని అన్నారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రేవంత్ కేవలం పగ, ప్రతీకారంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.

Similar News

News November 28, 2025

BREAKING.. ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్

image

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని ఓ రైతు నుంచి తహశీల్దార్ మహేందర్ రూ.15,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 28, 2025

గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

image

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.

News November 28, 2025

తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

image

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్‌కు పంపుతారు. ఈ యూనిట్‌లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.