News May 4, 2024
మహిళలకు రూ.2500 ఏమైంది?: హరీశ్రావు

TG: మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని BRS MLA హరీశ్రావు విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన హామీలు సైతం నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్.. యువత, నిరుద్యోగులను సైతం మోసం చేసిందని అన్నారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రేవంత్ కేవలం పగ, ప్రతీకారంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
Similar News
News November 17, 2025
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News November 17, 2025
న్యూస్ రౌండప్

⋆ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
⋆ నేడు మ.3 గంటలకు TG క్యాబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలు, అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
⋆ నేడు T BJP నేతల కీలక భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చ
⋆ లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో నేడు CBI విచారణకు పుట్ట మధు
News November 17, 2025
నువ్వుల పంట కోతకు వచ్చిందా?

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.


