News January 20, 2025
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగింది ఏమిటి?: కేటీఆర్

TG: ఏడాది కాంగ్రెస్ పాలనలో కటింగులు, కటాఫ్లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతుభరోసా, కరెంట్, కేసీఆర్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మీ రూ.2,500తో సహా ఇచ్చిన హామీలన్నింటిలోనూ కటింగ్ చేస్తుందని దుయ్యబట్టారు. ‘అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు? డబుల్ బెడ్రూంలకు మూడురంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్? జాగో తెలంగాణ జాగో’ అని రాసుకొచ్చారు.
Similar News
News January 28, 2026
‘రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం’.. పవార్ మృతిపై రాజ్ ఠాక్రే

అజిత్ పవార్ మృతిపై MNS చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన కామెంట్లు చేశారు. రాజకీయాల్లో నిజాయతీకి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇది తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు. ‘అజిత్ ముక్కుసూటిగా ఉంటారు. హామీలు ఇచ్చి మోసం చేయడం ఆయన శైలి కాదు. దీని వల్ల తను ఎంత మూల్యం చెల్లించుకున్నారో ఊహించుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. అటు <<18982388>>విమాన ప్రమాదంపై<<>> మమతాబెనర్జీ అనుమానం వ్యక్తం చేయడం తెలిసిందే.
News January 28, 2026
‘అజిత్’ రాజకీయ వారసులు ఎవరు?

మహారాష్ట్ర Dy CM అజిత్ పవార్ అకాలమృతి ఆయన రాజకీయ వారసత్వంపై ఊహాగానాలకు తెరతీసింది. కుమారుడు పార్థ్ లేదా భార్య సునేత్ర (రాజ్యసభ MP) పవార్ వారసత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బారామతి టెక్స్టైల్ కంపెనీ ఛైర్పర్సన్గా ఉన్న సునేత్ర గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. శరద్ పవార్ NCP నుంచి విడిపోయి అజిత్ BJP-శివసేన కూటమిలో చేరడం తెలిసిందే. కాగా వారసుల నిర్ణయాలు MH ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
News January 28, 2026
కడప జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: <


