News June 12, 2024
రన్ మెషీన్కు ఏమైంది!
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రేమికులను నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్లో పరుగుల వరద పారించిన అతడు పొట్టి ప్రపంచకప్లో ఆకట్టుకోలేకపోతున్నారు. అమెరికా గడ్డపై పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓపెనర్గా బరిలోకి దిగుతున్న కోహ్లీ గత రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో 1, 4 స్కోర్లతో వెనుదిరిగారు. తాజాగా USAతో మ్యాచ్లోనూ డకౌట్ అయ్యారు. కోహ్లీ ఫామ్పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 6, 2024
గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు వీరే
TGలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గద్వాల – N.శ్రీనివాసులు, MBNR – మల్లు నర్సింహారెడ్డి, వికారాబాద్ – శేరి రాజేశ్రెడ్డి, నారాయణపేట్ – వరాల విజయ్, కామారెడ్డి – మద్ది చంద్రకాంత్రెడ్డి, సంగారెడ్డి – G.అంజయ్య, వనపర్తి – G.గోవర్ధన్, RR – ఎలుగంటి మధుసూదన్రెడ్డి, కరీంనగర్ – సత్తు మల్లయ్య, నిర్మల్ – సయ్యద్ అర్జుమాండ్ అలీ, సిరిసిల్ల – నాగుల సత్యనారాయణ.
News October 6, 2024
భారత్ చేరుకున్న మహ్మద్ ముయిజ్జు
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్కు వచ్చారు. తన సతీమణి సాజిదా మహ్మద్తో కలిసి ఆయన న్యూఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ముయిజ్జు దేశంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, జైశంకర్ తదితరులతో భేటీ అవుతారు. తాజ్మహల్ సందర్శన అనంతరం ఆయన ముంబై, బెంగళూరులో జరిగే పలు వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.
News October 6, 2024
ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదు: CM
TG: ఎవరు అడ్డుపడినా మూసీ నది ప్రక్షాళన ఆగదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుతగులుతున్న BJP MP ఈటల రాజేందర్ కూడా BRS నేతల అడుగుజాడల్లోనే నడుస్తున్నారని సీఎం విమర్శించారు. మూసీ పరీవాహకంలో ఉంటున్న పేదల జీవితాలు బాగుపడవద్దా? అని ప్రశ్నించారు. నిర్వాసితులు అవుతారని ఆలోచిస్తే ప్రాజెక్టులు ఎలా సాధ్యమవుతాయన్నారు.