News December 30, 2024

అసెంబ్లీలో భువనేశ్వరిని అన్నప్పుడు ఏమయ్యారు: బుద్దా వెంకన్న

image

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై TDP సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని బియ్యం స్కామ్‌లో స్వయంగా భార్యను ఇరికించారన్నారు. ‘స్కామ్‌లో మీ భార్యను ఇరికించి మీరు తప్పించుకున్నారు. చంద్రబాబుది ఎవర్నీ కించపరిచే మనస్తత్వం కాదు. అలాంటి మనిషి భార్యను అసెంబ్లీలో మీ పార్టీ నేతలు నానా మాటలు అని అవమానించారు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్న మీరు అప్పుడేమయ్యారు?’ అని ప్రశ్నించారు.

Similar News

News November 23, 2025

భద్రాద్రి జిల్లాలో శనివారం ముఖ్యాంశాలు

image

✓భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్న
✓దమ్మపేట: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలు సీజ్
✓కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
✓కొత్తగూడెం: ఎన్కౌంటర్ బూటకమే: CPIML మధు
✓అనుమానిత వాహనాలు తనిఖీ చేసిన ఇల్లందు పోలీసులు
✓భద్రాచలం: ఇసుక లారీలతో ప్రజల ఇబ్బందులు
✓కొత్తగూడెం: 4 లేబర్ కోడ్ రద్దు చేయాలి: TUCI
✓సింగరేణిలో 1258 మంది ఉద్యోగులు పర్మినెంట్

News November 23, 2025

కుజ దోషం తొలగిపోవాలంటే?

image

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.

News November 23, 2025

కేజీ రూపాయి.. డజను రూ.60!

image

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.