News February 1, 2025
ఇద్దరు కేంద్రమంత్రులు, 8మంది MPలు ఏం సాధించారు?: హరీశ్ రావు

బడ్జెట్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమ్మిళిత వృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ‘రాజకీయ అవసరాల కోసమే బడ్జెట్ ఉపయోగించుకున్నారు. ఇలాంటి వైఖరితో వికసిత్ భారత్ సాధ్యమా? ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు వరాలు ప్రకటించారు. ఇది కేవలం 3 రాష్ట్రాల బడ్జెట్లా ఉంది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8మంది ఎంపీలు ఉండి ఏం సాధించారు’ అని ప్రశ్నించారు.
Similar News
News November 20, 2025
నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
News November 20, 2025
నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
News November 20, 2025
తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నా: ప్రియాంకా చోప్రా

‘వారణాసి’ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు తెలుగు నేర్చుకుంటున్నట్లు హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ఇన్స్టాలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తాను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు తన మాతృభాష కాదని, ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి సాయం చేస్తున్నారని ఇటీవల అన్నారు. రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి 2027 సమ్మర్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


