News March 2, 2025
‘తల్లికి వందనం’ ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేస్తే?

AP: తల్లికి వందనం <<15620703>>పథకం <<>>ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారికి వర్తింపజేయడంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉన్న వారే ప్రైవేట్ స్కూళ్లల్లో పిల్లలను చదివిస్తారని, వారికి పథకం ఎందుకుని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి, మెరుగైన టీచర్లను నియమిస్తే అడ్మిషన్లు పెరుగుతాయంటున్నారు. పథకం అందరికీ వర్తింపజేయాలని కొందరు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 18, 2025
ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.
News November 18, 2025
ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.
News November 18, 2025
నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.


