News June 28, 2024
TDP పోటీ చేస్తే ఎలా ఉండేదో?: సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో TDP పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో అన్నారు. టీడీపీ 10% ఓట్లు దక్కించుకునేదని, అప్పుడు కచ్చితంగా తమ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ అహంకారం, అతి తెలివితేటల వల్ల దెబ్బతిన్నారని చెప్పారు. తాను సీఎం కావడం, BRS ఓటమి, KCRను గద్దెదించడమనే తన మూడు రాజకీయ లక్ష్యాలూ నెరవేరాయన్నారు.
Similar News
News December 6, 2025
అన్నమయ్య: కట్నం కోసం వేధించిన ఐదుగురికి జైలు శిక్ష

సుండిపల్లి మండలంలో వివాహితను కట్నం కోసం వేధించిన ఐదుగురికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వీరబల్లి మండలం మట్లి వడ్డిపల్లికి చెందిన చెల్లారెడ్డి శివప్రసాద్ అతని తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరిపై వరకట్న వేధింపులపై 2022లో కేసు నమోదైంది. వారికి రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు SP కార్యాలయం వెల్లడించింది.
News December 6, 2025
అన్నమయ్య: కట్నం కోసం వేధించిన ఐదుగురికి జైలు శిక్ష

సుండిపల్లి మండలంలో వివాహితను కట్నం కోసం వేధించిన ఐదుగురికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వీరబల్లి మండలం మట్లి వడ్డిపల్లికి చెందిన చెల్లారెడ్డి శివప్రసాద్ అతని తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరిపై వరకట్న వేధింపులపై 2022లో కేసు నమోదైంది. వారికి రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు SP కార్యాలయం వెల్లడించింది.
News December 6, 2025
అరుణాచల ప్రదక్షిణకు HYD నుంచి ప్రత్యేక బస్సులు

అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం HYD–2 డిపో DSNR నుంచి ప్రత్యేక బస్సులను RTC అందుబాటులోకి తెచ్చింది. బస్సులు DEC 12న రాత్రి 7 గంటలకు బయలుదేరి, కాణిపాకం–గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుతాయి. తిరుగు ప్రయాణం 14న మ.3గంటలకు ప్రారంభమై ఉ.8గంటలకు HYD చేరుకోనుందని HYD-2 డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. ఒక్క టికెట్ ధర రూ.3,900 మరిన్ని వివరాలకు 9959444165 నంబర్లకు సంప్రదించాలన్నారు.


