News December 17, 2024

ఒకవేళ మూడో టెస్ట్ డ్రా అయితే?

image

AUSతో జరుగుతోన్న మూడో టెస్ట్ డ్రాగా ముగిసినా టీమ్ ఇండియా WTC ఫైనల్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే తర్వాత జరగబోయే మిగతా రెండు టెస్టుల్లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో IND 57.29 PCTతో మూడో స్థానంలో ఉంది. టాప్-2లో SA (63.33), AUS (60.71) ఉన్నాయి. మూడో టెస్ట్ డ్రా అయి, మిగతా 2 టెస్టులు గెలిస్తే భారత జట్టు PCT ఆసీస్ కంటే మెరుగవుతుంది.

Similar News

News December 19, 2025

జంట పేలుళ్ల దోషుల శిక్ష రద్దు పిటిషన్‌పై HC విచారణ

image

TG: లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల దోషులకు HC ఇద్దరు మిటిగేటర్లను నియమించింది. ఆరోగ్య, మానసిక స్థితి, పశ్చాత్తాప భావనను పరిగణించి మరణశిక్ష రద్దు చేయాలని నేరస్థులు పిటిషన్ వేశారు. తమ విచారణను మరో బెంచ్‌కు మార్చాలని కోరారు. దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. 2007లో HYD జంట పేలుళ్లతో 46మంది చనిపోయారు. ఈ కేసులో MHకు చెందిన అనిక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్‌లకు 2018లో ఉరిశిక్ష పడింది.

News December 19, 2025

స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని వినతి!

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రతకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే స్నానం చేసి స్కూల్‌కు వెళ్లే క్రమంలో చలిగాలులకు అస్వస్థతకు గురవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలతో అల్లాడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ <<18607575>>స్కూళ్ల టైమింగ్స్<<>> మార్చారు. ఇదే తరహాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల్లో అన్ని పాఠశాల సమయాలను మార్చాలని పేరెంట్స్ కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 19, 2025

పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.