News December 17, 2024
ఒకవేళ మూడో టెస్ట్ డ్రా అయితే?

AUSతో జరుగుతోన్న మూడో టెస్ట్ డ్రాగా ముగిసినా టీమ్ ఇండియా WTC ఫైనల్కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే తర్వాత జరగబోయే మిగతా రెండు టెస్టుల్లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో IND 57.29 PCTతో మూడో స్థానంలో ఉంది. టాప్-2లో SA (63.33), AUS (60.71) ఉన్నాయి. మూడో టెస్ట్ డ్రా అయి, మిగతా 2 టెస్టులు గెలిస్తే భారత జట్టు PCT ఆసీస్ కంటే మెరుగవుతుంది.
Similar News
News December 11, 2025
ఈ నూనెలతో మేకప్ తొలగిద్దాం..

మేకప్ వేసుకోవడంతో పాటు దాన్ని తియ్యడంలో కూడా జాగ్రత్తలు పాటిస్తేనే చర్మ ఆరోగ్యం బావుంటుందంటున్నారు నిపుణులు. వాటర్ ఫ్రూఫ్ మేకప్ తొలగించడానికి ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల సులువుగా శుభ్ర పడటంతో పాటు చర్మం కూడా తాజాగా ఉంటుంది. కీరదోస రసంలో చెంచా గులాబీ నూనె కలిపి ముఖానికి రాసుకున్నా మేకప్ పోతుంది. ఇది సహజ క్లెన్సర్ గానూ పని చేస్తుంది. తేనె, బాదం నూనె కలిపి మేకప్ తీసినా చర్మం పాడవకుండా ఉంటుంది.
News December 11, 2025
సర్పంచ్ ఎన్నికలు.. తల్లిపై కూతురి విజయం

TG: పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం <<18450009>>తిమ్మయ్యపల్లిలో<<>> తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమ విజయం సాధించారు. ఇద్దరిమధ్య హోరాహోరీగా పోరు జరగగా తల్లిపై కూతురు 91 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. సుమ గతంలో గ్రామానికే చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో రెండు కుటుంబాలు ఎన్నికల్లో ఢీకొన్నాయి.
News December 11, 2025
ఛార్జీలు పెంచబోమని ‘సర్దుబాటు’ బాదుడా: షర్మిల

AP: విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఓ పక్క CM CBN ప్రకటనలు చేస్తూ మరోపక్క సర్దుబాటు పేరిట ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమవ్వడం దారుణమని PCC చీఫ్ షర్మిల విమర్శించారు. ‘సర్దుబాటు పేరుతో ఇప్పటికే ₹15000 కోట్లు వసూలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మళ్లీ మరో ₹15651 కోట్ల సర్దుబాటు ఛార్జీలకు APERC రంగం సిద్ధం చేసింది. ఈమేరకు ప్రజలనుంచి అభిప్రాయాలకు నోటీసు జారీచేసింది.’ అని షర్మిల దుయ్యబట్టారు.


