News December 17, 2024

ఒకవేళ మూడో టెస్ట్ డ్రా అయితే?

image

AUSతో జరుగుతోన్న మూడో టెస్ట్ డ్రాగా ముగిసినా టీమ్ ఇండియా WTC ఫైనల్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే తర్వాత జరగబోయే మిగతా రెండు టెస్టుల్లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో IND 57.29 PCTతో మూడో స్థానంలో ఉంది. టాప్-2లో SA (63.33), AUS (60.71) ఉన్నాయి. మూడో టెస్ట్ డ్రా అయి, మిగతా 2 టెస్టులు గెలిస్తే భారత జట్టు PCT ఆసీస్ కంటే మెరుగవుతుంది.

Similar News

News December 23, 2025

పార్టీ, పదవుల కన్నా ప్రజలే ముఖ్యం: పవన్

image

AP: పార్టీ, పదవుల కన్నా నమ్మిన ప్రజలే తనకు ముఖ్యమని Dy.CM పవన్ అన్నారు. ‘పదవులు అలంకారం కాదు బాధ్యత. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నిస్తే సహించను. సంఘ విద్రోహులకు వైసీపీ కొమ్ము కాస్తోంది. అధికారులకు మళ్లీ చెబుతున్నా వైసీపీ మళ్లీ రాదు. పిల్లలకు కులాలను అంటగట్టి రాజకీయం చేస్తున్నారు. పిఠాపురం నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం’ అని జనసేన పదవి-బాధ్యత కార్యక్రమంలో తెలిపారు.

News December 23, 2025

నరమాంస తోడేలు.. తల్లి ఒడిలోని బాలుడిని ఎత్తుకెళ్లి..

image

UPలో నరమాంస తోడేళ్లు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా బహ్రైచ్‌(D) రసూల్‌పూర్ దారెహ్తాలో దారుణం జరిగింది. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు పడుతుండగా మూడేళ్ల చిన్నారి అన్షుని తోడేలు నోట కరుచుకుని పారిపోయింది. తల్లి దాని వెంట పడినప్పటికీ తెల్లవారుజామున కావడంతో ఆచూకీ దొరకలేదు. కొంతదూరంలో అన్షు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఆ జిల్లాలో తోడేళ్ల దాడిలో 12 మంది చనిపోగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.

News December 22, 2025

ఒక్క క్లిక్‌తో భూముల స‌మాచారం: మంత్రి

image

TG: భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థకు సంబంధించి జ‌న‌వ‌రిలో ఆధునీక‌రించిన డిజిటల్ వ్య‌వ‌స్థను తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రెవెన్యూ, స్టాంప్స్&రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్‌ఫామ్‌ కిందకి తీసుకొచ్చి “భూభార‌తి”తో లింక్ చేస్తాం. ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్‌తో లాగిన్ అవగానే ఒక్క క్లిక్‌తో భూముల స‌మాచారం వస్తుంది. స‌ర్వే నంబ‌ర్లకు మ్యాప్‌ను రూపొందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.