News April 15, 2025
నిమిషం పాటు UPI ఆగిపోతే?

ఆన్లైన్ పేమెంట్స్ పెరిగిపోవడంతో వరుస UPI అంతరాయాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. గత 18 రోజుల్లోనే బ్యాంక్స్ వల్ల 2, NPCI వల్ల 2 సార్లు UPI మొరాయించింది. ఇలా చేయడం వల్ల సెకనుకు 7వేలు, నిమిషానికి 4 లక్షలు, పది ని.లకు 40 లక్షల లావాదేవీలు ఆగిపోతున్నట్లు ‘మనీకంట్రోల్’ పేర్కొంది. దేశ వాణిజ్యానికి UPI ప్రాథమిక చెల్లింపు మార్గంగా మారిన నేపథ్యంలో ఇలాంటి అంతరాయాలకు కళ్లెం వేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
Similar News
News December 13, 2025
APPLY NOW: డిగ్రీ అర్హతతో 451 పోస్టులు

UPSC త్రివిధ దళాల్లో 451 పోస్టులను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026 ద్వారా భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ అర్హతగల వారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -24ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 13, 2025
మెస్సీ మ్యాచ్.. 3,000 మంది పోలీసులతో భద్రత

HYD ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రా.7.30 గంటలకు జరిగే రేవంత్vsమెస్సీ ఫుట్బాల్ మ్యాచుకు టికెట్ ఉన్న వారినే అనుమతించనున్నారు. ఈ మ్యాచుకు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. 450 CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 20ని.ల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచులో CM రేవంత్ ‘సింగరేణి RR9’ కెప్టెన్గా వ్యవహరిస్తారు. మ్యాచ్ తర్వాత మెస్సీతో పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.
News December 13, 2025
కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


