News March 8, 2025

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినకపోతే?

image

ఆరోగ్యకరమైన జీవనానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కానీ అల్పాహారాన్ని స్కిప్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే టిఫిన్ తినకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జీవక్రియ మందగించి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తలనొప్పి, వికారం, వాంతులు రావచ్చు. ఊబకాయం, అల్సర్, గ్యాస్ సమస్యలకూ దారితీస్తుంది. నిద్ర లేచిన రెండు గంటల్లోగా అల్పాహారం తీసుకోవడం బెటర్.

Similar News

News December 7, 2025

HYD: కాలుకు స్థలం దొరకటమే కష్టంగా మారిన రైల్వే కోచ్.!

image

సికింద్రాబాద్ సిల్చేర్ ఎక్స్‌ప్రెస్‌లో కాలుకు స్థలం దొరకడం కష్టంగా మారింది. కోచ్‌లో రద్దీ ఎంత ఉందంటే టికెట్ కలెక్టర్ లోపలికి వెళ్తే బయటకు రాలేని పరిస్థితి. రిజర్వేషన్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. SCR దీనికి తగిన చర్యలు తీసుకోవాలని అనేకమంది GM అధికారికి ఫిర్యాదులు చేస్తున్నారు. మరి ఈ రద్దీకి పరిష్కారం ఎప్పుడు? కామెంట్ చేయండి.

News December 7, 2025

రెండో విడత.. 415 స్థానాలు ఏకగ్రీవం

image

TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండో విడత నామినేషన్లలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాల్లో 415 చోట్ల ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా కామారెడ్డిలో 44 అయ్యాయని తెలిపింది. అటు 38,322 వార్డు స్థానాల్లో 8,304 చోట్ల ఏకగ్రీవమయ్యాయని పేర్కొంది. మిగతా 3,911 సర్పంచ్ స్థానాల్లో 13,128 మంది పోటీ పడుతుండగా 29,903 చోట్ల 78,158 మంది బరిలో ఉన్నారని తెలిపింది. ఈ నెల 14న పోలింగ్ జరగనుంది.

News December 7, 2025

అన్ని జిల్లాల్లో క్రీడా పోటీలు: ACA అధ్యక్షుడు చిన్ని

image

AP: రాష్ట్రంలో శాప్‌తో కలిసి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని క్రీడలను ప్రోత్సహిస్తామని MP, ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. అన్ని జిల్లాల్లో క్రీడా పోటీలు నిర్వ‌హించేందుకు CM CBN కృషి చేస్తున్నారని తెలిపారు. కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి 87వ సీనియ‌ర్ నేష‌న‌ల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లోగో, పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కాగా ఈ పోటీలు విజయవాడలో ఈ నెల 22 నుంచి 28 వరకు జరగనున్నాయి.