News September 4, 2024

₹10వేలు దేనికి సరిపోతాయి?: బాధితులు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రకటించిన ₹10వేలు దేనికి సరిపోతాయని వరద బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక్కో కుటుంబం సగటున ₹2లక్షలు నష్టపోయిందని, ప్రభుత్వం ఇచ్చే సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే సర్వే చేసి నష్టాన్ని అంచనా వేశాక సాయంపై నిర్ణయం తీసుకుంటామని CM చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆ సర్వే పూర్తయ్యేదెప్పుడో అని ప్రజలు సందేహిస్తున్నారు.

Similar News

News January 23, 2026

త్వరలో బీజేపీలోకి శశిథరూర్?

image

కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి పార్టీ MP శశిథరూర్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో తిరువనంతపురంలో జరిగిన PM మోదీ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే మోదీ పాలనను ప్రశంసించిన థరూర్‌ను INC దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. ఇటీవల రాహుల్ ఓ ప్రసంగంలో తన పేరును విస్మరించడంతో థరూర్ అసంతృప్తిగానూ ఉన్నారు. ఈ పరిణామాలతో ఆయన త్వరలోనే BJPలో చేరొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

News January 23, 2026

సింగరేణి టెండర్లపై విచారణ కోరుతూ కిషన్ రెడ్డికి హరీశ్ లేఖ

image

TG: నైనీ కోల్ స్కామ్‌పై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి BRS MLA, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. సింగరేణిలో అన్ని టెండర్లను రద్దు చేయాలని కోరారు. సింగరేణి టెండర్లపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. జడ్జితో కుదరకపోతే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ సింగరేణిలో మరో <<18937157>>3 స్కామ్‌లకు<<>> పాల్పడ్డారని హరీశ్ ఆరోపించారు.

News January 23, 2026

చిరు వ్యాపారులకు స్వనిధి క్రెడిట్ కార్డులు

image

వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వనిధి క్రెడిట్ కార్డు’లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులను పీఎం మోదీ ఈరోజు కేరళలో లాంచ్ చేశారు. <<17535471>>పీఎం స్వనిధి స్కీమ్‌<<>>లో భాగంగా రెండో విడత లోన్ తీసుకుని సకాలంలో చెల్లించిన వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇది UPI లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు. మ్యాగ్జిమమ్ లిమిట్ రూ.30వేలు. వ్యాలిడిటీ 5ఏళ్లు ఉంటుంది. కార్డు కోసం లోన్ ఇచ్చిన బ్యాంకులో సంప్రదించాలి.