News July 23, 2024

ఏంజిల్ ట్యాక్స్ అంటే?

image

కొన్ని కంపెనీలు పెట్టుబడి కోసం ఏంజిల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు షేర్లను జారీ చేస్తాయి. వీటిని ఫెయిర్ మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తారు. ఒకవేళ సమీకరించిన పెట్టుబడి మార్కెట్ విలువను మించితే ఆదాయంగా భావించి IT స్లాబుల ప్రకారం పన్ను వేస్తారు. ఈ పన్ను ఎగవేసేందుకు కొందరు మార్కెట్ విలువను తగ్గించి చూపిస్తున్నారు. దీనిని అడ్డుకొనేందుకు 2012లో ఏంజిల్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు.

Similar News

News March 26, 2026

చిరు, నాగబాబును అన్నయ్య అనే పిలుస్తా: అన్నా కొణిదెల

image

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనకు అన్నదమ్ములు లేరని, కానీ పెళ్లై కొణిదెల ఫ్యామిలీలోకి వచ్చాక చిరంజీవిని ‘అన్నయ్య’ అని, నాగబాబును ‘చిన్న అన్నయ్య’ అని పిలవడం భర్త నుంచి అలవాటైందని పేర్కొన్నారు. వరుసల పరంగా పిలుపులు వేరైనా.. మనసుతో వారిని తన సొంత సోదరులుగానే భావిస్తున్నానని ఆమె రాసుకొచ్చారు. మెగా బ్రదర్స్‌పై ఆమె చూపిన ఈ అనురాగం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

News March 26, 2026

మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిలాపియా రకం చేపలను పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

News March 26, 2026

కల్తీ పాల ఘటన.. CS, DGPకి NHRC నోటీసులు

image

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) సుమోటోగా తీసుకుంది. ఈ ఉదంతంపై రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ ఘటనలో 16 మంది <<19447985>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. ఇప్పటికీ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.