News July 14, 2024

జగన్నాథుని భాండాగారంలో ఏమున్నాయంటే?

image

1978లో ఒడిశా పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని చివరిసారిగా తెరిచారు. 70 రోజులు జరిగిన <<13627180>>లెక్కింపులో<<>> 128.38KGల 454 బంగారు ఆభరణాలు, 221.53KGల 293 వెండి ఆభరణాలను గుర్తించారు. లోపలి ట్రెజరీలో 43KGల 367 బంగారు వస్తువులు, 148KGల 231 వెండి వస్తువులను లెక్కించారు. బయటి ట్రెజరీలో 84.74KGల 87 బంగారు ఆభరణాలు, 73.64KGల 62 వెండి వస్తువులు గుర్తించారు. తాజా లెక్కింపు తర్వాత ఆభరణాల విలువను ప్రకటించనున్నారు.

Similar News

News December 13, 2025

పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రెండో శుక్రవారం ₹34.70 కోట్ల కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హిందీ పుష్ప-2(₹27.50Cr) రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(₹24.30Cr), యానిమల్(₹23.53Cr), గదర్-2(₹20.50Cr), హిందీ బాహుబలి-2(₹19.75Cr) ఉన్నాయి. ఓవరాల్‌గా ధురంధర్ మూవీ ₹300+Cr <<18544001>>కలెక్షన్లు<<>> సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది.

News December 13, 2025

రూ.3600 కోట్లతో హరియాణా క్లీన్ ఎయిర్ ప్లాన్!

image

గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు హరియాణా ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌తో MoU కుదుర్చుకుంది. రూ.3,600 కోట్లతో ‘హరియాణా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ను ప్రారంభించింది. ఐదేళ్లలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో (National Capital Region) గాలి నాణ్యత మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, 50,000 ఈ-ఆటోలకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి.

News December 13, 2025

టమాటాలో బొడ్డు కుళ్లు/ పూత వైపు కుళ్లు నివారణకు సూచనలు

image

టమాటా అభివృద్ధి చెందే దశలో నీటి ఎద్దడి, మొక్కల్లో కాల్షియం లోపం వల్ల బొడ్డు కుళ్లు కనిపిస్తుంది. నత్రజని, నేలలో కరిగే పోటాషియం, మెగ్నిషియం ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు నేలలో తేమ హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. భూమిలో తగినంత కాల్షియం ఉండేట్లు చూసుకోవాలి. పైరు కోత దశలో కాల్షియం నైట్రేట్ 7.5-10 గ్రాములు లేదా కాల్షియం క్లోరైడ్ 4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.