News June 5, 2024
నితీశ్ మనసులో ఏం ఉంది?

ఎన్డీఏ మిత్రపక్షాలు నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతున్నాయి. చంద్రబాబు, పవన్ సైతం విషెస్ చెప్పారు. బిహార్ సీఎం నితీశ్ మాత్రం స్పందించలేదు. పర్యావరణ దినోత్సవంపై ఆయన ఈరోజు ట్వీట్ చేయడంతో చర్చకు దారితీసింది. మోదీ సైతం CBN, పవన్ను అభినందిస్తూ ట్వీట్ చేసినప్పటికీ నితీశ్ను మరిచిపోయారు. దీంతో నితీశ్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ జరుగుతోంది. కాగా కౌంటింగ్కు ముందు రోజు మోదీ, నితీశ్ భేటీ అయ్యారు.
Similar News
News December 5, 2025
గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు

AP: విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు 480 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ(D)లోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి(D)లోని రాంబిల్లిలో భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. గూగుల్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్ఫ్రా పేరున కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా వెయ్యి మెగా వాట్ల ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది.
News December 5, 2025
ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే..?

ఉప్పుతో పెట్టే దీపాన్నే ఐశ్వర్య దీపం అంటారు. శుక్రవారం ఈ దీపాన్ని వెలిగిస్తే సిరిసంపదలకు లోటుండదని నమ్మకం. ఇలా 11, 21 వారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘ఉప్పులో దృష్టి దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఇంట్లో పసిపిల్లలకు ఎలాంటి దోషం కలగకూడదంటే ఈ దీపం వెలిగించాలి’ అని చెబుతున్నారు. ఉప్పు దీపం ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 5, 2025
కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. సెల్ఫ్ స్లాట్కు అవకాశం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<


