News September 19, 2024
లంచ్ సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?

బంగ్లాదేశ్తో తొలి టెస్టులో 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ను యశస్వి, పంత్ ఆదుకున్నారు. లంచ్ విరామం వరకు వికెట్ కోల్పోకుండా నియంత్రణతో ఆడారు. భారత జట్టు 23 ఓవర్లలో 88 పరుగులు చేయగా యశస్వి(37), పంత్(33) క్రీజులో ఉన్నారు.
Similar News
News September 15, 2025
తెలంగాణ అప్డేట్స్

* సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా నిర్వహించాలని CM రేవంత్కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ
* ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16వరకు నిర్వహించే పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపు
* బీఈడీలో రెండో విడతలో 7,441 మందికి సీట్ల కేటాయింపు. ఇవాళ కాలేజీలో రిపోర్ట్ చేయాలని అధికారుల సూచన
* ఇవాళ్టి నుంచి నాగ్పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్
News September 15, 2025
కలెక్టర్ల కాన్ఫరెన్స్.. చర్చించే అంశాలు ఇవే

AP: ఇవాళ, రేపు సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్లో వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, హౌసింగ్, సూపర్ సిక్స్ పథకాలు, పీ-4, అన్న క్యాంటీన్లు, సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టుల పురోగతిపై చర్చించనున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు విద్య, వైద్యం, రెవెన్యూ తదితర అంశాలపై చర్చ జరగనుంది.
News September 15, 2025
ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు

APPSC 10 తానేదార్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 330. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://portal-psc.ap.gov.in/