News October 4, 2024
భారత్ టార్గెట్ ఎంతంటే?

మహిళా టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ముందు న్యూజిలాండ్ 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా కివీస్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు ప్లిమ్మర్(34), బేట్స్(27) శుభారంభాన్ని ఇచ్చారు. మరో బ్యాటర్ డివైన్ (57) అర్థసెంచరీ చేయడంతో NZ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుక 2, అరుంధతి, శోభన తలో వికెట్ తీశారు.
Similar News
News October 23, 2025
మరో నాలుగైదు రోజులు వర్షాలు: APSDMA

AP: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, ఏలూరు, ప.గో., NTR, ఉమ్మడి తూ.గో., విశాఖ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
News October 23, 2025
ఈశాన్య మూలలో చెట్లు ఉండకూడదా?

గృహానికి ఈశాన్య దిశలో వృక్షాలు లేకపోవడమే ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఈశాన్య కోణం నిర్మలంగా ఉండాలని, అప్పుడే సూర్య కిరణాల ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని అన్నారు. ‘ఈ మూలలో చెట్లు ఉంటే సూర్యరశ్మికి అడ్డంకి అవుతాయి. సాధారణంగా ఈ దిశలో బావి/బోరు ఉంటాయి. చెట్ల వేళ్లు నేలలోకి చొచ్చుకుపోతే జలం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆ దిశను శుభ్రంగా ఉంచాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>
News October 23, 2025
ఉద్యోగ ఒత్తిడి ప్రాణాంతకం: ప్రొఫెసర్

దీర్ఘకాలిక ఉద్యోగ ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ కల్చర్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించి, అకాల మరణానికి కూడా దారితీయవచ్చని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెఫ్రీ పిఫెర్ హెచ్చరించారు. అధిక పని గంటలు, ఉద్యోగ భద్రత లేమి వంటి అంశాలు ఒత్తిడి సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. హానికరమైన ఉద్యోగంలో కొనసాగడం వ్యక్తి శ్రేయస్సుకు ప్రమాదమని ఈ అంశాన్ని ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు.