News January 28, 2025

భారత్ టార్గెట్ ఎంతంటే?

image

రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో T20లో ఇంగ్లండ్ టీమ్‌ఇండియా ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ENG 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ డకెట్(51) అర్ధసెంచరీ చేశారు. ఒకానొక దశలో ఇంగ్లండ్‌ 140 పరుగులే అందుకోవడం కష్టమనుకున్న సమయంలో లివింగ్ స్టోన్ (43) బిష్ణోయ్ ఓవర్లో మూడు సిక్సులు కొట్టి 19రన్స్ రాబట్టారు. వరుణ్ 5, హార్దిక్ 2, బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

Similar News

News December 4, 2025

సూర్యాపేట: పోస్టల్ బ్యాలెట్‌లు జాగ్రత్తగా జారీ చేయాలి: కలెక్టర్

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా జారీ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పోలింగ్ అనంతరం ఓట్లను కౌంటింగ్ చేయడానికి తగిన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 4, 2025

వీధికుక్కలు వెంబడిస్తే ఇలా చేయకండి!

image

బైకర్లను వీధికుక్కలు వెంబడించి భయపెట్టడం తెలిసిందే. ఈ సమయంలో కొందరు వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదానికి గురవుతుంటారు. నిన్న వరంగల్(D) మచ్చాపూర్‌లో కుక్కల భయానికి ఓ వ్యక్తి బైక్‌ను వేగంగా నడుపుతూ అదుపుతప్పి డ్రైనేజీలో పడి చనిపోయాడు. కుక్కలు వెంబడిస్తే బైక్‌ను వేగంగా నడపొద్దు. గట్టిగా అరిస్తే అవి మరింత రెచ్చిపోతాయి. రియాక్ట్ అవ్వకుండా ఉంటే అవి సైలెంట్ అవుతాయి. వాటి కళ్లలోకి నేరుగా చూడకండి.

News December 4, 2025

సిరి ధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో లాభం

image

చిరు ధాన్యాల సాగు, వినియోగం క్రమంగా పెరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలే దీనికి కారణం. చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ని, BP, షుగర్, గుండె వ్యాధుల ముప్పును తగ్గించి రక్తహీనతను దూరం చేస్తాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు తొందరగా అలసిపోకుండా ఉండేందుకు మిల్లెట్స్ దోహదపడతాయి.