News November 12, 2024
అవినీతి జరిగితే మోదీ ఏం చేస్తున్నారు?: KTR

TG: కేంద్ర ప్రభుత్వ స్కీంలో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని KTR ప్రశ్నించారు. రూ.8,888కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని కోరారు. అడ్రస్, అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారని, వాటి వివరాలను ఆన్లైన్లో కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంలా మారిందని బీజేపీ అంటోందని, దీనిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రేవంత్, పొంగులేటిల భరతం పట్టడం ఖాయమని KTR హెచ్చరించారు.
Similar News
News December 12, 2025
ఆ పార్టీతో మాకు సంబంధం లేదు: శ్రీను, మాధురి

<<18539894>>ఫామ్హౌస్ పార్టీకి<<>> తమకు సంబంధం లేదని MLC దువ్వాడ శ్రీను, మాధురి తెలిపారు. ‘మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు పిలిస్తే అక్కడికి వెళ్లాం. బిజినెస్ మీట్ పెడుతున్నాం రమ్మని అడిగారు. అక్కడ విదేశీ మద్యం, హుక్కా ఉందని మాకు తెలియదు’ అని శ్రీను మీడియాకు చెప్పారు. ‘నాకు హుక్కా అంటే ఏంటో కూడా తెలియదు. పోలీసులు చెప్పాకే ఆ పార్టీకి పర్మిషన్ లేదని తెలిసింది. నేను అరెస్ట్ కాలేదు. ఇంట్లోనే ఉన్నా’ అని మాధురి వివరించారు.
News December 12, 2025
‘పత్తిలో 18% తేమ ఉన్నా కొనుగోలు చేయాలి’

సీసీఐ తేమ నిబంధనలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిని సడలించాలని.. TDP MP లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. లోక్సభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పత్తిలో తేమ 8-12% మించకూడదని CCI నిబంధనలున్నాయి. దీన్ని సడలించి 18% తేమ ఉన్నా కొనుగోలు చేయాలి. అలాగే వర్షంలో తడిచినా, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి’ అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
News December 12, 2025
మునగాకుతో ఎన్నో లాభాలు

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.


