News September 3, 2024

పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే?

image

APలో వరద పరిస్థితులు నెలకొంటే డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చింది. ‘పవన్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై నివేదికలు పరిశీలిస్తున్నారు. తన శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రతి 6 గంటలకు అన్ని జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు’ అని పవన్ చేపట్టిన పనుల వివరాలు పంచుకుంది.

Similar News

News October 23, 2025

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

image

AP: రైతుల నుంచి కనీస మద్దతు ధరకు CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పత్తి రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో నమోదై, సీఎం యాప్ ద్వారా లాగిన్ అయి, ఆధార్ అనుసంధానంతో కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. కపాస్ యాప్ స్లాట్ బుకింగ్ ప్రకారం పత్తిని CCI కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. రైతులకు సందేహాలుంటే 7659954529కు కాల్ చేయొచ్చు.

News October 23, 2025

‘కపాస్ కిసాన్ యాప్’లో నమోదు ఎలా?

image

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్‌లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.

News October 23, 2025

స్థానిక ఎన్నికలే అజెండా.. మరికొన్ని గంటల్లో క్యాబినెట్ భేటీ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈరోజు 3PMకు క్యాబినెట్​ భేటీ కానుంది. నిలిచిపోయిన ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకు వెళ్లాలో సీఎం, మంత్రులు చర్చించనున్నారు. ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే చట్ట సవరణ ఆర్డినెన్స్​ ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానుంది.