News December 26, 2024
క్రిస్మస్కు పోప్ ఫ్రాన్సిస్ సందేశమిదే

క్రిస్మస్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచానికి తన సందేశాన్ని అందించారు. ప్రజలు విద్వేషాలకు వ్యతిరేకంగా గొంతెత్తాలని, ధైర్యాన్ని పుంజుకోవాలని ఆయన కోరారు. ‘రేపటిపై ఆశతో జీవించాలని కోరుతున్నాను. ఉక్రెయిన్, పశ్చిమాసియా, గాజా, లెబనాన్, సిరియా వంటి ప్రాంతాలన్నింటిలోనూ ఆయుధాలను పక్కన పెట్టండి. దయచేసి శాంతిని స్వీకరించండి. ఎంతోమంది పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారు’ అని సందేశాన్నిచ్చారు.
Similar News
News January 29, 2026
సిమెంట్ ఉత్పత్తిలో భారత్ సత్తా.. మన దగ్గరే ఎక్కువ!

ప్రపంచ సిమెంట్ ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచిందని ఎకనామిక్ సర్వే 2025-26 పేర్కొంది. ప్రస్తుతం దేశీయంగా 690M టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా AP, TG సహా 12రాష్ట్రాల్లోనే 85% పరిశ్రమలున్నాయి. అయితే ప్రపంచ సగటు తలసరి వినియోగం 540Kgs ఉండగా మన దేశంలో 290 కిలోలుగానే ఉంది. ప్రభుత్వాలు రోడ్లు, రైల్వే, గృహనిర్మాణ పథకాలపై దృష్టి సారించడం వల్ల సిమెంట్ వాడకం పెరుగుతుందని సర్వే పేర్కొంది.
News January 29, 2026
ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News January 29, 2026
రీసర్వేతో 86వేల సరిహద్దు వివాదాలు పరిష్కారం: ఎకనమిక్ సర్వే

AP: రాష్ట్రంలోని 6,901 గ్రామాల్లో 81 లక్షల భూకమతాలను రీసర్వే చేసినట్లు ఎకనమిక్ సర్వే వెల్లడించింది. 86 వేల సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయని పేర్కొంది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చినట్లు తెలిపింది. APలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. APతోపాటు పంజాబ్, UP, గుజరాత్కు విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది.


