News December 20, 2024
కరెంటు దొంగిలించడమేంటి ప్రజాప్రతినిధీ?

కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి, కమీషన్లు బహిరంగ రహస్యమే అయినా కరెంటు బిల్లులకూ కక్కుర్తి పడటమేంటని ప్రశ్నిస్తున్నారు. సంభల్ ఎంపీ <<14929852>>జియా<<>> ఉర్ ఇంట్లో మీటర్లను ట్యాంపర్ చేయడాన్ని విమర్శిస్తున్నారు. లక్షల్లో జీతాలు వస్తున్నా రూ.2 కోట్ల మేర కరెంటు దొంగిలించి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని అడుగుతున్నారు. వనరులను సొంత జాగీరుగా భావించడంపై మీ కామెంట్.
Similar News
News January 17, 2026
పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.
News January 17, 2026
కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

AP: ఈ సంక్రాంతి సీజన్లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.
News January 17, 2026
162 పోస్టులకు NABARD నోటిఫికేషన్ విడుదల

<


