News December 20, 2024
కరెంటు దొంగిలించడమేంటి ప్రజాప్రతినిధీ?

కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి, కమీషన్లు బహిరంగ రహస్యమే అయినా కరెంటు బిల్లులకూ కక్కుర్తి పడటమేంటని ప్రశ్నిస్తున్నారు. సంభల్ ఎంపీ <<14929852>>జియా<<>> ఉర్ ఇంట్లో మీటర్లను ట్యాంపర్ చేయడాన్ని విమర్శిస్తున్నారు. లక్షల్లో జీతాలు వస్తున్నా రూ.2 కోట్ల మేర కరెంటు దొంగిలించి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని అడుగుతున్నారు. వనరులను సొంత జాగీరుగా భావించడంపై మీ కామెంట్.
Similar News
News November 18, 2025
CNG సరఫరా నిలిచి ముంబైలో స్తంభించిన రవాణా

ముంబైలో 2 రోజులుగా CNG సరఫరా నిలిచి ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో ఆదివారం నుంచి గ్యాస్ సరఫరా నిలిచింది. CNGతో నడిచే ఆటోలు, కార్లు, బస్సులు తిరగక అవస్థలు తప్పలేదు. సోమవారం నాటికి కొంతమేర సరఫరా చేపట్టారు. నేటి మధ్యాహ్నానికి కానీ పూర్తి సరఫరా కాదని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ముంబైలో CNGతో నడిచే కార్లే 5 లక్షల వరకు ఉన్నాయి.
News November 18, 2025
CNG సరఫరా నిలిచి ముంబైలో స్తంభించిన రవాణా

ముంబైలో 2 రోజులుగా CNG సరఫరా నిలిచి ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో ఆదివారం నుంచి గ్యాస్ సరఫరా నిలిచింది. CNGతో నడిచే ఆటోలు, కార్లు, బస్సులు తిరగక అవస్థలు తప్పలేదు. సోమవారం నాటికి కొంతమేర సరఫరా చేపట్టారు. నేటి మధ్యాహ్నానికి కానీ పూర్తి సరఫరా కాదని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ముంబైలో CNGతో నడిచే కార్లే 5 లక్షల వరకు ఉన్నాయి.
News November 18, 2025
మావోలకు మరో 4 నెలలే గడువు: బండి

TG: అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. హిడ్మా హతం సందర్భంగా ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని, మరో 4 నెలలే ఉన్నందున నక్సల్స్ లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బుల్లెట్ను కాకుండా బ్యాలెట్ను నమ్ముకోవాలని సూచించారు. కేవలం పోలీసులు, సైనికుల చేతుల్లోనే తుపాకులు ఉండాలన్నారు.


