News September 14, 2024
తొలి టెస్టుకు టీమ్ ఇండియా వ్యూహమేంటో..!

బంగ్లాతో తొలి టెస్టులో భారత్ వ్యూహమేంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ పిచ్లలో రెండు రకాలు కనిపిస్తున్నాయి. నల్లమట్టి పిచ్పై స్పిన్నర్లు, ఎర్రమట్టి పిచ్పై పేసర్లు సాధన చేశారు. ఈ రెండింటిపైనా బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలమే అయినప్పటికీ పేస్కు అనుకూలమైన ఎర్రమట్టి పిచ్ను మ్యాచ్ కోసం భారత్ రెడీ చేయించింది. దీంతో అసలు టీమ్ ఇండియా వ్యూహమేంటన్న చర్చ జరుగుతోంది.
Similar News
News November 15, 2025
పోలీస్ స్టేషన్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర?

జమ్మూకశ్మీర్ నౌగామ్ <<18292633>>పోలీస్ స్టేషన్<<>>లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ PAFF ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర కూడా ఉందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ కేసు దర్యాప్తు చేస్తుండగానే ఈ పేలుడు సంభవించినట్లు J&K పోలీసులు ప్రకటించారు. కానీ, ఉగ్రకోణం అనుమానాలను కొట్టిపారేయకుండా ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించారు.
News November 15, 2025
ప్రభాస్- డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కాంబోలో మూవీ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో ఫౌజీ, స్పిరిట్, సలార్& కల్కి సీక్వెల్స్ ఉండగా మరో సినిమాకు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ డైరెక్టర్గా మారనున్నారని, ఆయన చెప్పిన కథను ప్రభాస్ ఓకే చేసినట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రభాస్ ‘రాజాసాబ్’ వచ్చే Jan-9న విడుదలవనుంది.
News November 15, 2025
ఎగ్ షెల్ పేరెంటింగ్ గురించి తెలుసా?

పిల్లల్ని పెంచడంలో పేరెంట్స్ వివిధ రకాల పద్ధతులను ఎంచుకుంటారు. వాటిల్లో ఒకటే ఎగ్ షెల్ పేరెంటింగ్. ఇందులో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడికీ పంపకుండా తమ వద్దే ఉంచుకుంటారు. పిల్లలు బయటకు వెళ్లి అందరితో కలిస్తేనే నైపుణ్యాలు వస్తాయి. సమస్యల్ని, సవాళ్లని తమంతట తాము పరిష్కరించుకునేలా తయారవుతారు. అన్నిట్లో తల్లిదండ్రులపై ఆధారపడకూడదు. కాబట్టి ఇలాంటి విధానం పిల్లలకు మంచిది కాదంటున్నారు నిపుణులు.


