News September 14, 2024
తొలి టెస్టుకు టీమ్ ఇండియా వ్యూహమేంటో..!

బంగ్లాతో తొలి టెస్టులో భారత్ వ్యూహమేంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ పిచ్లలో రెండు రకాలు కనిపిస్తున్నాయి. నల్లమట్టి పిచ్పై స్పిన్నర్లు, ఎర్రమట్టి పిచ్పై పేసర్లు సాధన చేశారు. ఈ రెండింటిపైనా బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలమే అయినప్పటికీ పేస్కు అనుకూలమైన ఎర్రమట్టి పిచ్ను మ్యాచ్ కోసం భారత్ రెడీ చేయించింది. దీంతో అసలు టీమ్ ఇండియా వ్యూహమేంటన్న చర్చ జరుగుతోంది.
Similar News
News November 22, 2025
తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్ను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ENG బౌలర్లను ఓపెనర్ హెడ్ ఊచకోత కోశారు. కేవలం 83 బంతుల్లోనే 123 రన్స్ బాదారు. లబుషేన్ 51* రన్స్తో రాణించారు.
స్కోర్స్: ENG- 172, 164.. AUS- 132, 205/2
News November 22, 2025
iBOMMA రవిని పోలీస్ శాఖలో నియమించుకోవాలి:CVL

iBOMMA రవిని అందరూ రాబిన్హుడ్లా చూస్తున్నారని సీనియర్ అడ్వొకేట్, నటుడు CVL నరసింహారావు చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడితే సినిమాల్లో ఒకరు పుట్టుకొస్తాడని, అదే తీరులో రవి వచ్చాడని తెలిపారు. నిర్మాతలు తప్ప అతనిపై సామాన్యులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఎంతో నాలెడ్జ్ ఉన్న రవిని శిక్షించడం కంటే పోలీస్ శాఖలో సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
News November 22, 2025
మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

TG: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోలు లొంగిపోగా, వారిలో 25 మంది మహిళా కామ్రేడ్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు సాంబయ్య, నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారిపై ఉన్న రూ.1.41కోట్ల రివార్డును వారికే అందిస్తాం అని చెప్పారు. ఈ సందర్భంగా మావోల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.


