News February 28, 2025

ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఎంతంటే?

image

AP: రూ.48,340కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయం లాభదాయకంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగంలో 15శాతం వృద్ధి మా టార్గెట్. కొత్త కౌలు చట్టం తీసుకొస్తాం. రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు కేటాయించి పథకాలు అమలు చేస్తాం’ అని మంత్రి అన్నారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి పూర్తిస్థాయి వ్యవసాయ బడ్జెట్ గురించి తెలుసుకోండి.

Similar News

News February 28, 2025

ఒక్క పోస్ట్‌తో టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయింది!

image

ఏదైనా కొండను చూసినప్పుడు అది జంతువు లేక మనిషి ఆకారంలో కనిపించడాన్ని గమనిస్తుంటాం. ఓ కొండ అచ్చం కుక్క ముఖం ఆకారంలో కనిపించడంతో అది చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. చైనాలోని షాంఘైకి చెందిన గువో కింగ్‌షాన్ తన వెకేషన్ ఫొటోను షేర్ చేయగా అందులో ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న పర్వతంపై అందరి దృష్టీ పడింది. దీనిని ‘పప్పీ మౌంటేన్’ అని ఆమె పిలిచింది. దీంతో ఫొటోగ్రాఫర్లు, టూరిస్టులు ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు.

News February 28, 2025

GET READY: రేపు 11AM గంటలకు ‘కన్నప్ప’ టీజర్

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ రేపు విడుదల కానుంది. మార్చి 1వ తేదీన ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘టీజర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.

News February 28, 2025

ఈశా ఫౌండేషన్ పై చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

image

ఈశా ఫౌండేషన్ కేసులో హైకోర్టు తీర్పు సరైనదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఫౌండేషన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తమిళనాడు వెల్లియంగిరిలోని ఫౌండేషన్‌కు పర్యావరణ అనుమతులు లేవని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీచేసింది. దీంతో ఈశా ఫౌండేషన్ హైకోర్టును సంప్రదించింది. నిర్మాణం సక్రమంగానే జరిగిందని హైకోర్టు నోటీసులను కొట్టివేయడంతో బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

error: Content is protected !!