News March 11, 2025
ఎలా డైట్ చేస్తే మంచిది?

వెంటనే బరువు తగ్గాలని కొందరు చేస్తున్న డైట్ ప్రాణాలకు ముప్పు తెస్తోంది. తాజాగా కేరళ యువతి <<15712364>>శ్రీనంద<<>> ఇలాగే ఆహారం మానేసి 5నెలల పాటు నీళ్లే తాగి చనిపోయింది. రోజూ మనం తీసుకునే ఫుడ్లో 500క్యాలరీల చొప్పున తగ్గిస్తే.. వారానికి 0.5కేజీ, నెలకు 2కిలోలు తగ్గుతామని వైద్యులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యవంతమైన డైట్ అని అంటున్నారు. కొందరు 24- 72hrs కేవలం నీళ్లతోనే డైట్ చేస్తారని ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
Similar News
News April 6, 2026
నంద్యాల: అధికారుల పని తీరుపై కలెక్టర్ అసంతృప్తి

PGRSలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో 106 మందికి సున్నా మార్కులు రావడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News April 6, 2026
లాకప్ డెత్ కేసు.. తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష

తమిళనాడులో 2020లో జరిగిన తండ్రి-కుమారుల లాకప్ డెత్ కేసుపై మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. లాక్డౌన్లో 2020 జూన్ 19న జయరాజ్, ఆయన కుమారుడు జే బెన్నిక్స్ను పోలీసులు లాకప్లో వేశారు. విచారణ పేరుతో హింసించడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అనుమతించిన దాని కంటే ఎక్కువ సమయం మొబైల్ షాప్ నడిపారని వీరిని అరెస్ట్ చేయగా ఆ ఆరోపణల్లో నిజం లేదని తేలింది.
News April 6, 2026
వాట్సాప్ యూజర్లకు శుభవార్త

జర్నీస్, ఔట్ డోర్స్లో వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నాయిస్తో ఇబ్బంది పడుతున్నారా? అలాంటి వారికి వాట్సాప్ శుభవార్త చెప్పింది. రియల్ టైమ్లో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ను తొలగించి, వాయిస్ క్వాలిటీని పెంచే ఫీచర్ను డెవలప్ చేసింది. దీన్ని ప్రస్తుతం కొందరు Beta యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అందరికీ 2.26.14.1 వెర్షన్ అప్డేట్ను విడుదల చేసే అవకాశం ఉంది.


