News October 16, 2024
కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏంటంటే?: హరీశ్ రావు

TG: పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘మహిళలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తానని ఇవ్వలేదు. రూ.15వేల రైతుబంధు అమలు చేయలేదు. ఆగస్టులో చేయాల్సిన చేప పిల్లల పంపిణీ అక్టోబర్ వచ్చినా చేయలేదు. KCR కిట్ కంటే మంచిది ఇస్తానని చెప్పి గర్భిణులను మోసం చేశారు’ అని మండిపడ్డారు. ఉన్న పథకాలను నిలిపివేయడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని అన్నారు.
Similar News
News November 22, 2025
ములుగు: టీఆర్పీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాలోని 10 మండలాలకు సోషల్ మీడియా కన్వీనర్లను ప్రకటించింది. ములుగుకు బుద్దే రాజు, వెంకటాపూర్- దుగ్గొని నిశాల్, గోవిందరావుపేట- సునావత్ మోహన్ రావు, ఏటూరునాగారం- గగ్గురీ రాంబాబు, వాజేడు- బొల్లె రమేష్, వెంకటాపురం- శ్రీరామ్ నాగ సునీల్, కన్నాయిగూడెం- భీముని నరేష్, మంగపేట- బండి సందీప్, మల్లంపల్లి- నూనె రాజ్ కుమార్లను నియమించినట్లు జిల్లా కన్వీనర్ తెలిపారు.
News November 22, 2025
ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. సన్నాహాలు షురూ!

TGలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగా APలోనూ సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను SEC సేకరించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారుచేయగానే నోటిఫికేషన్ విడుదలచేసే ఛాన్స్ ఉంది. కాగా APలో 2021 FEB, APRలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.
News November 22, 2025
ఈ-రేస్ కేసులో ఏసీబీ రిపోర్ట్.. నిందితులు వీరే

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్టు బయటికొచ్చింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి, A4గా కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఈ-రేస్ కంపెనీ FEO పేర్లను పొందుపరిచింది. 2024 డిసెంబర్ 19న కేసు నమోదవగా ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపింది. కాగా ఈ కేసులో ఛార్జ్షీట్ నమోదుకు, కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.


