News April 12, 2025
ఆ 400 ఎకరాల తాకట్టులో దాగిన చీకటి కోణం ఏంటి?: హరీశ్ రావు

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని BRS MLA హరీశ్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టుకోలేదని ICICI బ్యాంక్ చెబుతోందని, మరి GOVT ఎక్కడ తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. CM రేవంత్ తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా? అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 20, 2025
అమరావతి తప్ప CBNకు ఇంకేమీ పట్టదు: అమర్నాథ్

AP: అమరావతి ప్రొజెక్ట్ అయితే చాలు ఇతర ప్రాంతాలేమైపోయినా ఫర్వాలేదన్నట్లు CM ఉన్నారని YCP నేత G.అమర్నాథ్ విమర్శించారు. ‘విశాఖ భూములను తన వారికి కట్టబెట్టి అక్కడ ఏ యాక్టివిటీ లేకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. సెటిల్మెంట్లపై పవన్ IAS, IPSలను కాకుండా భూముల్ని దోచిపెడుతున్న CBNను ప్రశ్నించాలి. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు తప్పదు’ అని హెచ్చరించారు. అందర్నీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు.
News December 20, 2025
TCILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) 5పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BE, B.Tech, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రిలిమినరీ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.tcil.net.in
News December 20, 2025
ప్రతి ఇంట్లోనూ జరగాలి ‘ముస్తాబు’

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఇందుకు మంచి ఆహారమే కాకుండా శుభ్రత కూడా అవసరమే. అందరిలో అందంగా కనపడాలని ఎలా ముస్తాబవుతామో రోగాల నుంచి తప్పించుకోవడానికి ఇళ్లు, స్కూళ్లు, పరిసరాల్లో క్లీనింగ్ అవసరం. APలోని ఓ కలెక్టర్ ప్రారంభించిన <<18618970>>‘ముస్తాబు’<<>> కార్యక్రమం ఇప్పుడు అన్ని పాఠశాలల్లో ప్రారంభమైంది. ఇదే స్ఫూర్తిని ప్రతీ ఇల్లు, వీధి, గ్రామం, పట్టణం తేడాలేకుండా కొనసాగిస్తే ఆరోగ్యం, ఆనందం మన సొంతం. ఏమంటారు?


