News April 12, 2025
ఆ 400 ఎకరాల తాకట్టులో దాగిన చీకటి కోణం ఏంటి?: హరీశ్ రావు

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని BRS MLA హరీశ్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టుకోలేదని ICICI బ్యాంక్ చెబుతోందని, మరి GOVT ఎక్కడ తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. CM రేవంత్ తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా? అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 20, 2025
వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ జమ

TG: ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో వరి సన్నాలను పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున రూ.649.84 కోట్లను విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 30.35 లక్షల టన్నుల సన్నవడ్లను సర్కారు సేకరించింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమైంది.
News December 20, 2025
రేపు తెలంగాణ భవన్కు కేసీఆర్

TG: చాలారోజుల తర్వాత గులాబీ బాస్ KCR పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. రేపు మ.2 గంటలకు ఆయన ఆధ్వర్యంలో BRS LP, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ‘ఏపీ జల దోపిడీ-కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం’ అనే అంశంపై మాట్లాడనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’పై KCR దిశానిర్దేశం చేస్తారని BRS వర్గాలు తెలిపాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా ఆయన సూచనలు చేస్తారని చెప్పాయి.
News December 20, 2025
క్లీనింగ్ టిప్స్

* నిమ్మకాయను మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని దానిలో కాస్త వంట సోడాను కలిపి సింక్ కొళాయిలకు రాసి అరగంట తరువాత కడిగితే మురికి వదిలిపోతుంది.
* కప్పుల్లో కాఫీ, టీ మరకలు వదలకపోతే వెనిగర్ లో ఉప్పు కలిపి రుద్దితే త్వరగా వదిలిపోతాయి.
* స్టెయిన్ లెస్ స్టీల్ సింక్ మీద నీళ్ళ మరకలు పోవాలంటే వంటసోడాలో వెనిగర్ కలిపి రుద్దాలి. గంట తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే కొత్తదానిలా మెరిసిపోతుంది.


