News April 12, 2025

ఆ 400 ఎకరాల తాకట్టులో దాగిన చీకటి కోణం ఏంటి?: హరీశ్ రావు

image

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని BRS MLA హరీశ్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టుకోలేదని ICICI బ్యాంక్ చెబుతోందని, మరి GOVT ఎక్కడ తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. CM రేవంత్ తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా? అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 24, 2026

‘ధురంధర్-2’ బ్యాన్ చేయాలని కోర్టుకు..

image

ధురంధర్-2 సినిమాను బ్యాన్ చేయాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టును మౌఖికంగా కోరినట్లు Live Law వెల్లడించింది. ‘ఈ చిత్రంలో రాజకీయ అంశాలున్నాయి. TN ఎన్నికల వేళ ఈ సినిమాను ప్రదర్శించకూడదు’ అని పేర్కొన్నట్లు తెలిపింది. అయితే చిత్రంపై అభ్యంతరం ఉంటే ముందుగా రిట్ పిటిషన్‌ దాఖలు చేసి, ఆ తర్వాత అత్యవసర విచారణ కోరాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News March 24, 2026

భద్రాద్రి రాముడిపై వివాదం.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

image

TG: భద్రాద్రి రామయ్య గోత్ర నామాల <<19454045>>వివాదంపై<<>> దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికనూ పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఆ తర్వాతే ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. రాజ్యాంగంలోని 25, 26 అధికరణ ప్రకారం పూజా విధానాల్లో మార్పులకు వీల్లేదని పిటిషనర్లు చెప్పారు. ఇరుపక్షాల వాదన నిమిత్తం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

News March 24, 2026

రైతులకు రుణమాఫీ ప్రతిపాదన లేదు: కేంద్రం

image

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద రైతు రుణమాఫీ చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రుణమాఫీ కంటే కూడా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే సాయం, PM కిసాన్ నిధులు, తక్కువ వడ్డీకే లోన్లు అందించడం వంటి చర్యల ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పూచీకత్తు లేని లోన్ల పరిమితిని ₹2 లక్షలకు పెంచామని వివరించారు.