News April 12, 2025

ఆ 400 ఎకరాల తాకట్టులో దాగిన చీకటి కోణం ఏంటి?: హరీశ్ రావు

image

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని BRS MLA హరీశ్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టుకోలేదని ICICI బ్యాంక్ చెబుతోందని, మరి GOVT ఎక్కడ తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. CM రేవంత్ తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా? అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 2, 2026

మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

image

కొంతకాలంగా తగ్గిన బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో అవైన్ ఇన్ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించారు. దీంతో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అటు నీలగిరి, కోయంబత్తూరు సహా కేరళ సరిహద్దు గల జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. TNలోకి వైరస్ వ్యాపించకుండా కోళ్ల వ్యాన్స్‌ను వెటర్నరీ టీమ్స్ తనిఖీ చేస్తున్నాయి.

News January 2, 2026

ఈ ప్రాణులు భాగస్వామితో కలవగానే చనిపోతాయి

image

ప్రపంచంలో 11 ప్రాణులు తమ భాగస్వామితో కలిశాక చనిపోతాయని BBC వైల్డ్ లైఫ్ పేర్కొంది. అవి.. గ్రీన్ అనకొండ, మగ తేనెటీగలు, అమెజాన్ కప్ప, ఎలుకను పోలిన యాంటిచినుస్ మార్సుపియాల్స్, వాస్ప్ స్పైడర్స్, ఆక్టోపస్, గొల్లభామను పోలిన ప్రేయింగ్ మాంటిస్, పసిఫిక్ సాల్మన్, రెడ్‌బ్యాక్ స్పైడర్స్, లాబర్డ్ ఊసరవెల్లి. కలిసిన సమయంలో అధిక హార్మోన్ల విడుదల, శక్తి కోల్పోవడం, భాగస్వామి తినేయడం వంటి కారణాలతో ఇవి చనిపోతాయి.

News January 2, 2026

పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం: CBN

image

AP: 22 లక్షల పాసుపుస్తకాల పంపిణీతో ప్రతి ఇంట్లో సంతోషం నెలకొందని CM CBN పేర్కొన్నారు. ‘గత పాలకులు తమ ఫొటోలతో పాసుపుస్తకాలు పంపిణీ చేసి ₹22Cr తగలేశారు. రీసర్వేతో వివాదాలు పెంచారు. మేం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో మేలు చేశాం. లక్ష్యం నెరవేరేలా మంత్రులు చొరవ చూపాలి’ అని టెలికాన్ఫరెన్సులో CM సూచించారు. ఇవాళ ఆరంభమైన పాసుపుస్తకాల పంపిణీ 9వ తేదీ వరకు కొనసాగనుంది. కార్యక్రమంలో ఒకరోజు CM పాల్గొంటారు.