News July 13, 2024
అవే తప్పులు చేస్తే మనకీ వారికి తేడా ఏంటి?: గడ్కరీ

కాంగ్రెస్ చేసిన తప్పుల్నే చేస్తే బీజేపీకి, ఆ పార్టీకి తేడా ఏంటంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. గోవాలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీజేపీ మిగతావాటికంటే భిన్నమైన పార్టీ. అదే మన ప్రత్యేకత అని అద్వానీ చెప్పేవారు. అధికారంలో ఉండగా చేసిన తప్పుల వల్లే కాంగ్రెస్ ఓడింది. మనం ఆ తప్పులకు దూరంగా ఉండాలి’ అని సూచించారు. అవినీతిరహిత దేశం కోసం పాటుపడాలని కోరారు.
Similar News
News December 22, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

మీరు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా? వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ చేయించుకోవడం ద్వారా వైకుంఠ ద్వారం తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొంది, అన్ని పాపాల నుంచి విముక్తి చెంది, శ్రేయస్సుతో కూడిన మోక్ష మార్గాన్ని పొందండి. మీ పేరు & గోత్రంతో సంకల్పం నమోదు చేసుకుని వెంటనే వేదమందిర్లో <
News December 22, 2025
ఆవు పొదుగులోనే అరవై ఆరు పిండివంటలూ..

ఆవు పాలు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల నుంచి అనేక రకాలైన వంటకాలు, పిండి వంటలను తయారు చేయవచ్చు. ఈ సామెత ఆవు పాలు, వాటి ఉత్పత్తుల యొక్క గొప్పతనాన్ని, అవి అందించే విస్తృతమైన ప్రయోజనాలను, వంటకాల వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. ఆవు పాలు ఎన్నో రకాలైన రుచికరమైన, సాంప్రదాయకమైన ఆహార పదార్థాలకు మూలాధారమని దీని అర్థం.
News December 22, 2025
మట్టితో చేసిన శివలింగాన్ని ఎందుకు పూజించాలి?

మట్టితో చేసిన శివలింగాన్ని పార్థివ లింగం అంటారు. దీన్ని పూజించడం అత్యంత శ్రేష్ఠం. స్వహస్తాలతో చేసిన లింగాన్ని శుద్ధమైనదిగా పరిగణిస్తారు. దీన్ని ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. 16 సోమవారాల వ్రతంలో ప్రతి వారం కొత్తది కూడా చేసుకొని పంపించవచ్చు. అభిషేకాలూ చేయవచ్చు. అలాగే నిమజ్జనానికి కూడా అనుకూలంగా ఉంటుంది. నిష్ఠతో మట్టి లింగాన్ని చేసి ఆరాధించడం శివానుగ్రహం సులభంగా లభించి, కష్టాలన్నీ పోతాయని నమ్మకం.


