News July 13, 2024
అవే తప్పులు చేస్తే మనకీ వారికి తేడా ఏంటి?: గడ్కరీ

కాంగ్రెస్ చేసిన తప్పుల్నే చేస్తే బీజేపీకి, ఆ పార్టీకి తేడా ఏంటంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. గోవాలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీజేపీ మిగతావాటికంటే భిన్నమైన పార్టీ. అదే మన ప్రత్యేకత అని అద్వానీ చెప్పేవారు. అధికారంలో ఉండగా చేసిన తప్పుల వల్లే కాంగ్రెస్ ఓడింది. మనం ఆ తప్పులకు దూరంగా ఉండాలి’ అని సూచించారు. అవినీతిరహిత దేశం కోసం పాటుపడాలని కోరారు.
Similar News
News December 29, 2025
ఉద్యోగుల అంశంపై హరీశ్రావుకు శ్రీధర్ బాబు కౌంటర్

TG: అసెంబ్లీలో ఉద్యోగుల అంశంపై BRS నేత హరీశ్రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘ఆరు DAలు పెండింగ్లో ఉన్నాయి. రెండేళ్లయినా PRC లేదు. పోలీసులకు సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు. ఉద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తోంది’ అని హరీశ్ విమర్శించారు. అయితే ఉద్యోగుల గురించి BRS మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్ కౌంటర్ ఇచ్చారు. గత పాలకులు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
News December 29, 2025
జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం

AP: జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చింది. రాయచోటిని మదనపల్లె జిల్లాకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు మార్చేందుకు ఆమోదం తెలిపింది.
News December 29, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

<


