News July 13, 2024
అవే తప్పులు చేస్తే మనకీ వారికి తేడా ఏంటి?: గడ్కరీ

కాంగ్రెస్ చేసిన తప్పుల్నే చేస్తే బీజేపీకి, ఆ పార్టీకి తేడా ఏంటంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. గోవాలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీజేపీ మిగతావాటికంటే భిన్నమైన పార్టీ. అదే మన ప్రత్యేకత అని అద్వానీ చెప్పేవారు. అధికారంలో ఉండగా చేసిన తప్పుల వల్లే కాంగ్రెస్ ఓడింది. మనం ఆ తప్పులకు దూరంగా ఉండాలి’ అని సూచించారు. అవినీతిరహిత దేశం కోసం పాటుపడాలని కోరారు.
Similar News
News December 3, 2025
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 3, 2025
పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.
News December 3, 2025
అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

AP: అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది.


