News August 10, 2024
మాల్దీవ్స్తో వివాదం ఏంటి?

చైనా అనుకూలుడైన మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజ్జు ఇటీవల భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. డ్రాగన్ దేశంతో వాణిజ్య-వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల మోదీని ఉద్దేశించి ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన భారతీయులు బాయ్కాట్ మాల్దీవ్స్కు పిలుపునిచ్చారు. అనంతరం ఆ దేశ ప్రభుత్వం భారత సైన్యాన్ని వెనక్కి పంపడం వంటివి వివాదాన్ని మరింత పెంచాయి.
Similar News
News November 27, 2025
తీవ్ర అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడుతుందని APSDMA వెల్లడించింది. ఇది ఈ నెల 29 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంట గంటకు 50-70KM వేగంతో గాలులు వీస్తాయంది.
News November 27, 2025
నేడే మెగా వేలం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) మెగా ఆక్షన్ నేడు ఢిల్లీలో జరగనుంది. 277 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల వరల్డ్ కప్లో రాణించిన దీప్తీ శర్మ, రేణుక, వోల్వార్ట్ తదితరులు భారీ ధర దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇవాళ వేలంలోకి వచ్చే క్రికెటర్లలో దియా యాదవ్(16), భారతి సింగ్(16) తక్కువ వయస్సుగల వారు కాగా, SA ప్లేయర్ షబ్నిమ్(37)ఓల్డెస్ట్ క్రికెటర్.
News November 27, 2025
దారిద్ర్యాన్ని తొలగించే దక్షిణామూర్తి స్తోత్రం మహిమ

ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై|
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే||
దక్షిణామూర్తి స్తోత్రం అత్యంత విశిష్టమైనది. ఈ స్తోత్రం గురు శిష్యుల గొప్పతనాన్ని వివరిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణామూర్తి ఇతర స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు కూడా జ్ఞాన సాధన కోసం చాలా ముఖ్యమని ఆదిశంకరాచార్యులు చెప్పినట్లు చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.


