News August 10, 2024
మాల్దీవ్స్తో వివాదం ఏంటి?

చైనా అనుకూలుడైన మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజ్జు ఇటీవల భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. డ్రాగన్ దేశంతో వాణిజ్య-వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల మోదీని ఉద్దేశించి ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన భారతీయులు బాయ్కాట్ మాల్దీవ్స్కు పిలుపునిచ్చారు. అనంతరం ఆ దేశ ప్రభుత్వం భారత సైన్యాన్ని వెనక్కి పంపడం వంటివి వివాదాన్ని మరింత పెంచాయి.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


