News July 18, 2024
రాష్ట్ర బడ్జెట్ అంచనా ఎంతంటే?

TG: ఈ ఏడాది వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయం, రుణ సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులపై స్పష్టత వచ్చాకే రాష్ట్ర ఆదాయ, వ్యయాల మొత్తాలను ఖరారు చేయాలని ఆర్థికశాఖకు ప్రభుత్వం సూచించింది. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా, రాష్ట్రంలో ఈ 25న ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Similar News
News November 26, 2025
2019 ఎన్నికల్లో జిల్లాలో 41 పంచాయతీలు ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2019 ఎన్నికల్లో 41 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవ ఎన్నిక జరిగే పంచాయతీలకు రూ.10లక్షల ప్రోత్సాహకం ఇస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో 41 గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. పదవీకాలం ముగిసినా ప్రోత్సాహకం మాత్రం పంచాయతీలకు అందలేదు. తాజాగా ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున అందజేస్తామని ఓ మీటింగ్లో మంత్రి తుమ్మల చెప్పినా ఏకగ్రీవంపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
News November 26, 2025
NPCILలో 122 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 122 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, PG, PG డిప్లొమా, MBA, BE, B.Tech, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.56,100, Jr ట్రాన్స్లేటర్కు రూ.35,400 చెల్లిస్తారు. npcilcareers.co.in
News November 26, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేట్ రూ.870 ఎగబాకి రూ.1,27,910కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.800 పెరిగి రూ.1,17,250గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.2వేలు పెరిగి రూ.1,76,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.


