News May 4, 2024
ఈరోజు ఏపీ, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఈరోజు అత్యధికంగా ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5°C, వైఎస్సార్ జిల్లా కలసపాడులో 46.4°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. 14 జిల్లాల్లో 43°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. ఇక తెలంగాణలో అత్యధికంగా కరీంనగర్ జిల్లా వీణవంకలో, జగిత్యాల జిల్లా అల్లీపూర్, జైనలో 46.8°C టెంపరేచర్ రికార్డు అయింది.
Similar News
News September 19, 2025
శాసనమండలి వాయిదా

AP: శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఆ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం ఎదుట నిరసనకు దిగారు. దీంతో శాసనమండలి వాయిదా పడింది.
News September 19, 2025
ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లు <<17674897>>వాహనమిత్ర <<>>పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. <<17731468>>అప్లికేషన్ ఫాంలను<<>> ఫిల్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి. వాటిపై సచివాలయ సిబ్బంది 22న క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. అర్హుల జాబితాను 24న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి దసరా పండుగ రోజున ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తారు.
News September 19, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరిగి రూ.1,11,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.150 ఎగబాకి రూ.1,02,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,43,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.